కర్నాటకలో బసవరాజ బొమ్మై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు ఇప్పటివరకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను రద్దుచేసింది. వీళ్ళకు రద్దుచేసిన రిజర్వేషన్లను ఒక్కలిగ, లింగాయత్ లకు సర్దుబాటు చేసింది. ఎన్నికలు మరో రెండునెలల్లో ఉన్నాయనగా రాష్ట్రంలోని ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేయటమంటే పెద్ద సంచలనమనే చెప్పాలి. పైగా రాష్ట్రంలో ముస్లింల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇలాంటి సమయంలోనే ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేయటం అంటే సంచలనమే కాదు పెద్ద సాహసమనే అనుకోవాలి.
ముస్లింలకు రిజర్వేషన్ రద్దుచేయటాన్ని బొమ్మై సమర్ధించుకున్నారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని గతంలో సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేస్తున్నారు. రద్దుచేసిన 4 శాతం రిజర్వేషన్లను ఒక్కలిగ, లింయాత్ లకు చెరి రెండుశాతాన్ని సర్దుబాటు చేశారు. తాజా సర్దుబాటుతో 2 సీ కేటగిరిలో ఉన్న ఒక్కలిగ రిజర్వేషన్ 4 నుండి 6 శాతానికి పెరిగింది. అలాగే 2 డీలోని లింగాయత్ ల రిజర్వేషన్ శాతం 5 నుండి ఏడుకి పెరిగింది.
ముస్లింలు ఎవరైనా కోర్టుకు వెళ్ళినా వాళ్ళ వాదన చెల్లుబాటు కానీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎలాగంటే ఈడబ్ల్యూఎస్ కేటగరిలో కేంద్రప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ కేటగిరిలోకి బొమ్మై ప్రభుత్వం ముస్లింలను చేర్చింది. అలాగే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ శాతాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. తాజా డెవలప్మెంట్లతో మొత్తంమీద రిజర్వేషన్లు 50 నుండి 56 శాతానికి పెరిగింది.
బొమ్మై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. నిజానికి రిజర్వేషన్లనేవి తేనెతుట్టె లాంటివని అందరికీ తెలిసిందే. ఒకళ్ళకి రిజర్వేషన్ కల్పించినా, మరొకళ్ళకి తగ్గించినా మిగిలిన మతాలు, కులాలు ఊరుకోవు. అందుకనే ఏ ప్రభుత్వం కూడా వీటిజోలికి పోదు. అలాంటిది బొమ్మై ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు రద్దుచేయటమంటే మామూలు విషయంకాదు. కర్నాటకలో ముస్లింల జనాభా గణనీయంగానే ఉన్నాయి. 234 సీట్ల రాష్ట్రంలో కనీసం 40 స్ధానాల్లో ముస్లింల ఓట్లు ఫలితాలను నిర్ణయించేంతగా ఉందని ఒక అంచనా. మరి రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఎలాగుంటుందో చూడాల్సిందే.
This post was last modified on March 26, 2023 10:25 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…