Political News

ఏడుగురు ముఖ్యమంత్రుల్ని పిలిస్తే ఒక్కరు రాలేదట!

మచ్చ పడిన వేళ ఏం చేయాలి? ఆ మచ్చను విజయవంతంగా చెరిపించుకునే పనిలో నిమగ్నం కావాలి. అందుకు భిన్నంగా తన తోటి ముఖ్యమంత్రులు ఏడుగురిని విందునకు ఆహ్వానిస్తే ఏం జరుగుతుంది? మామూలుగా అయితే మొహమాటం కోసమైనా హాజరయ్యే వారేమో. కానీ.. అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ. చూస్తూ.. చూస్తూ ఆయనతో పెట్టుకోవటం ఎందుకు అనుకున్నారో కానీ.. ముచ్చట పడి విందునకు ఆహ్వానించిన ముఖ్యమంత్రికి మిగిలిన సీఎంలు అంతా కలిసి గైర్హాజరుతో షాకిచ్చిన వైనం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది.

రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గడిచిన శనివారం ఒక రాజకీయ విందునకు ప్లాన్ చేశారట. బయటకు రాని ఈ ఉదంతం.. కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది. దేశంలోని బీజేపీ.. కాంగ్రెస్సేతర పార్టీల ముఖ్యమంత్రులు కాకుండా మిగిలిన ముఖ్యమంత్రుల్లో ఏడుగురిని (ఆయనతో పాటు ఎనిమిది) ఢిల్లీకి ఆహ్వానించారు.

దీనికి సంబంధించి ఆయన ప్రత్యేకంగా ఒక లేఖ కూడా రాశారు. ప్రోగ్రెసివి చీఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా పొట్టిగా చెప్పాలంటే “జీ8” పేరుతో ఆయన ఒక విందు భేటీకి ఆహ్వానించారు. వచ్చే ఏడాది లోక్ సభకు జరిగే సార్వత్రిక ఎన్నికల వేళ.. కేంద్ర రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న ఆయన.. అందులో భాగంగా ఈ రాజకీయ విందు భేటీకి ఆహ్వానం పంపారు. అయితే.. కేజ్రీవాల్ అంచనాలకు భిన్నంగా ఈ విందునకు ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాని వైనం షాకింగ్ గా మారింది. తాను ప్రత్యేకంగా ఆహ్వానించిన ఏడుగురు ముఖ్యమంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఢిల్లీ మెహం చూడకపోవటం ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఈ విషయం గురించి తెలిసిన తర్వాత మోడీనా మజాకానా? అన్న మాట మనసులో మెదలక మానదు.

Satya

Recent Posts

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

2 hours ago

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

4 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

9 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

11 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

11 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

13 hours ago