Political News

ఏడుగురు ముఖ్యమంత్రుల్ని పిలిస్తే ఒక్కరు రాలేదట!

మచ్చ పడిన వేళ ఏం చేయాలి? ఆ మచ్చను విజయవంతంగా చెరిపించుకునే పనిలో నిమగ్నం కావాలి. అందుకు భిన్నంగా తన తోటి ముఖ్యమంత్రులు ఏడుగురిని విందునకు ఆహ్వానిస్తే ఏం జరుగుతుంది? మామూలుగా అయితే మొహమాటం కోసమైనా హాజరయ్యే వారేమో. కానీ.. అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ. చూస్తూ.. చూస్తూ ఆయనతో పెట్టుకోవటం ఎందుకు అనుకున్నారో కానీ.. ముచ్చట పడి విందునకు ఆహ్వానించిన ముఖ్యమంత్రికి మిగిలిన సీఎంలు అంతా కలిసి గైర్హాజరుతో షాకిచ్చిన వైనం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది.

రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గడిచిన శనివారం ఒక రాజకీయ విందునకు ప్లాన్ చేశారట. బయటకు రాని ఈ ఉదంతం.. కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది. దేశంలోని బీజేపీ.. కాంగ్రెస్సేతర పార్టీల ముఖ్యమంత్రులు కాకుండా మిగిలిన ముఖ్యమంత్రుల్లో ఏడుగురిని (ఆయనతో పాటు ఎనిమిది) ఢిల్లీకి ఆహ్వానించారు.

దీనికి సంబంధించి ఆయన ప్రత్యేకంగా ఒక లేఖ కూడా రాశారు. ప్రోగ్రెసివి చీఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా పొట్టిగా చెప్పాలంటే “జీ8” పేరుతో ఆయన ఒక విందు భేటీకి ఆహ్వానించారు. వచ్చే ఏడాది లోక్ సభకు జరిగే సార్వత్రిక ఎన్నికల వేళ.. కేంద్ర రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న ఆయన.. అందులో భాగంగా ఈ రాజకీయ విందు భేటీకి ఆహ్వానం పంపారు. అయితే.. కేజ్రీవాల్ అంచనాలకు భిన్నంగా ఈ విందునకు ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాని వైనం షాకింగ్ గా మారింది. తాను ప్రత్యేకంగా ఆహ్వానించిన ఏడుగురు ముఖ్యమంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఢిల్లీ మెహం చూడకపోవటం ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఈ విషయం గురించి తెలిసిన తర్వాత మోడీనా మజాకానా? అన్న మాట మనసులో మెదలక మానదు.

This post was last modified on March 21, 2023 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

24 minutes ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

2 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

2 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

3 hours ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

3 hours ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

4 hours ago