మచ్చ పడిన వేళ ఏం చేయాలి? ఆ మచ్చను విజయవంతంగా చెరిపించుకునే పనిలో నిమగ్నం కావాలి. అందుకు భిన్నంగా తన తోటి ముఖ్యమంత్రులు ఏడుగురిని విందునకు ఆహ్వానిస్తే ఏం జరుగుతుంది? మామూలుగా అయితే మొహమాటం కోసమైనా హాజరయ్యే వారేమో. కానీ.. అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ. చూస్తూ.. చూస్తూ ఆయనతో పెట్టుకోవటం ఎందుకు అనుకున్నారో కానీ.. ముచ్చట పడి విందునకు ఆహ్వానించిన ముఖ్యమంత్రికి మిగిలిన సీఎంలు అంతా కలిసి గైర్హాజరుతో షాకిచ్చిన వైనం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది.
రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గడిచిన శనివారం ఒక రాజకీయ విందునకు ప్లాన్ చేశారట. బయటకు రాని ఈ ఉదంతం.. కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది. దేశంలోని బీజేపీ.. కాంగ్రెస్సేతర పార్టీల ముఖ్యమంత్రులు కాకుండా మిగిలిన ముఖ్యమంత్రుల్లో ఏడుగురిని (ఆయనతో పాటు ఎనిమిది) ఢిల్లీకి ఆహ్వానించారు.
దీనికి సంబంధించి ఆయన ప్రత్యేకంగా ఒక లేఖ కూడా రాశారు. ప్రోగ్రెసివి చీఫ్ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా పొట్టిగా చెప్పాలంటే “జీ8” పేరుతో ఆయన ఒక విందు భేటీకి ఆహ్వానించారు. వచ్చే ఏడాది లోక్ సభకు జరిగే సార్వత్రిక ఎన్నికల వేళ.. కేంద్ర రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న ఆయన.. అందులో భాగంగా ఈ రాజకీయ విందు భేటీకి ఆహ్వానం పంపారు. అయితే.. కేజ్రీవాల్ అంచనాలకు భిన్నంగా ఈ విందునకు ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాని వైనం షాకింగ్ గా మారింది. తాను ప్రత్యేకంగా ఆహ్వానించిన ఏడుగురు ముఖ్యమంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఢిల్లీ మెహం చూడకపోవటం ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఈ విషయం గురించి తెలిసిన తర్వాత మోడీనా మజాకానా? అన్న మాట మనసులో మెదలక మానదు.
This post was last modified on March 21, 2023 3:10 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…