ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే పాటకు నెగటివిటీ వచ్చింది. హరీష్ శంకర్ గత సినిమా మిస్టర్ బచ్చన్ పెద్ద డిజాస్టర్. ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నా గ్రౌండ్ లెవెల్ లో ఊపు ఇంకా పెరగాల్సి ఉంది. ఈ స్టేట్మెంట్లన్నీ నిజమే. కానీ పవన్ కళ్యాణ్ బ్రాండ్ ముందు ఈ మైనస్సులు పని చేయడం లేదు.
ఆలస్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టినప్పటికీ బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో లక్షా పదహారు వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. దురంధర్ ది రివెంజ్ కు అతి దగ్గరలో అవర్లీ ట్రెండింగ్ జరగడం మరో స్పెషల్ ట్విస్ట్. అది ప్యాన్ ఇండియా భాషల్లో వస్తుండగా పవన్ మూవీ కేవలం సింగల్ లాంగ్వేజ్ తెలుగులోనే రిలీజవుతోంది. అలా చూసుకుంటే ఉస్తాద్ కన్నా ఎక్కువగా పవ పేరే పని చేస్తోన్న వైనం స్పష్టం.
ఇప్పటికే ఇరవై కోట్లకు దగ్గరగా వెళ్తున్న గ్రాస్ రేపు ఉదయం నాలుగు గంటలకు తొలి షో పడేలోపు మరింత మెరుగైన నెంబర్లు నమోదు చేయడం ఖాయం. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ ప్రీమియర్లు లాంటి వాటికి వెసులుబాటు దొరక్కపోవడంతో కలెక్షన్లలో కొంత తగ్గుదల ఉంటుంది. అయితే ఏపీలో ధరలు పెంచుకునే సౌలభ్యం ఉండటం వల్ల ఓవరాల్ గా రెవిన్యూ బ్యాలన్స్ అవుతుందని చెప్పొచ్చు. కాకపోతే టాక్ రావడం చాలా కీలకం కానుంది.
హైప్, బజ్ సంగతి పక్కనపెడితే రేపు మాట్లాడాల్సింది ఫైనల్ గా కంటెంటే. ఏ మాత్రం బాగున్నా రికార్డుల మోత ఖాయం. అసలే టాలీవుడ్ బాక్సాఫీస్ ఆకలి మీద ఉంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఒక్క స్టార్ హీరో సినిమా లేక థియేటర్లు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు ఆదుకోవాల్సింది పవన్ కళ్యాణే. దురంధర్ రివెంజ్ మీద కూడా గంపెడాశలు ఉన్నాయి. మరి ఉస్తాద్ అంచనాలు అందుకుని అరాచకం ఏ స్థాయిలో చేస్తాడో తెలియాలంటే ఉదయం దాకా వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on March 18, 2026 11:19 am
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…