ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే పాటకు నెగటివిటీ వచ్చింది. హరీష్ శంకర్ గత సినిమా మిస్టర్ బచ్చన్ పెద్ద డిజాస్టర్. ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నా గ్రౌండ్ లెవెల్ లో ఊపు ఇంకా పెరగాల్సి ఉంది. ఈ స్టేట్మెంట్లన్నీ నిజమే. కానీ పవన్ కళ్యాణ్ బ్రాండ్ ముందు ఈ మైనస్సులు పని చేయడం లేదు.
ఆలస్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టినప్పటికీ బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో లక్షా పదహారు వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. దురంధర్ ది రివెంజ్ కు అతి దగ్గరలో అవర్లీ ట్రెండింగ్ జరగడం మరో స్పెషల్ ట్విస్ట్. అది ప్యాన్ ఇండియా భాషల్లో వస్తుండగా పవన్ మూవీ కేవలం సింగల్ లాంగ్వేజ్ తెలుగులోనే రిలీజవుతోంది. అలా చూసుకుంటే ఉస్తాద్ కన్నా ఎక్కువగా పవ పేరే పని చేస్తోన్న వైనం స్పష్టం.
ఇప్పటికే ఇరవై కోట్లకు దగ్గరగా వెళ్తున్న గ్రాస్ రేపు ఉదయం నాలుగు గంటలకు తొలి షో పడేలోపు మరింత మెరుగైన నెంబర్లు నమోదు చేయడం ఖాయం. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ ప్రీమియర్లు లాంటి వాటికి వెసులుబాటు దొరక్కపోవడంతో కలెక్షన్లలో కొంత తగ్గుదల ఉంటుంది. అయితే ఏపీలో ధరలు పెంచుకునే సౌలభ్యం ఉండటం వల్ల ఓవరాల్ గా రెవిన్యూ బ్యాలన్స్ అవుతుందని చెప్పొచ్చు. కాకపోతే టాక్ రావడం చాలా కీలకం కానుంది.
హైప్, బజ్ సంగతి పక్కనపెడితే రేపు మాట్లాడాల్సింది ఫైనల్ గా కంటెంటే. ఏ మాత్రం బాగున్నా రికార్డుల మోత ఖాయం. అసలే టాలీవుడ్ బాక్సాఫీస్ ఆకలి మీద ఉంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఒక్క స్టార్ హీరో సినిమా లేక థియేటర్లు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు ఆదుకోవాల్సింది పవన్ కళ్యాణే. దురంధర్ రివెంజ్ మీద కూడా గంపెడాశలు ఉన్నాయి. మరి ఉస్తాద్ అంచనాలు అందుకుని అరాచకం ఏ స్థాయిలో చేస్తాడో తెలియాలంటే ఉదయం దాకా వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on March 18, 2026 11:19 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…