అనుకున్నదే జరుగుతోంది. ఏపీలో రాజకీయాలు భారీ స్థాయిలో వేడెక్కాయి. అనూహ్యమైన పరిణామంగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని టీడీపీ ఇప్పుడు ఊరూవాడా ప్రచారం చేయాలని నిర్ణయించింది .గత ఎన్నికలకు ముందు.. వివేకా హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ.. అప్పటి ఎన్నికల్లో ప్రజల నుంచిసానుభూతిని సొంతం చేసుకుంది.
ఫలితంగా.. వైసీపీ భారీ సంఖ్యలో ఓట్లు సీట్లు దక్కించుకుంది. ఇక, ఇప్పుడు అదే మంత్రాన్ని టీడీపీ జపి స్తోంది. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. అన్నీ కూడా వివేకానంద రెడ్డి హత్య.. దీనిలో సీఎం జగన్ పాత్ర.. నాటకం.. ఎలా రక్తి కట్టించారు? అనే విషయాల చుట్టూనే తిరిగాయి. అసలు ఈ కేసుతో జగన్కు సంబంధం ఉందని కూడా చంద్రబాబు వివరించారు.
మొత్తంగా చూస్తే.. టీడీపీ వివేకా కేసుతో దూకుడు పెంచిందనే తెలుస్తోంది. ఇలా..చంద్రబాబు ఈ విషయాన్ని అందిపుచ్చుకోగానే.. టీడీపీ అనుకూల మీడియాలోనూ వివేకానందరెడ్డి మరణంపై తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. తాజాగా సీబీఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం.. దీనిలో ఏం జరిగిందో కొంత చెప్పడం వంటి పరిణామాలు..ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా టీడీపీ ఇప్పుడు వివేకా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్న విషయం కూడా చర్చకు వస్తోంది. క్షేత్రస్థాయిలో జగన్ను ఎదిరించేందుకు ఉన్న అవకాశం ఇదేనని భావిస్తున్న టీడీపీ.. ఇక నుంచి ఆయనను రాజకీయంగానే కాకుండా నైతికంగా కూడా దెబ్బతీయాలని నిర్ణయించింది. మరి ఏమేరకు టీడీపీ సక్సెస్ అవుతుందో చూడాలి.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…
మార్క్ ఆంటోనీ, గత ఏడాది అజిత్ తో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని చర్చలు జరిగాయి. అటు సినిమాలు,…
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…