అనుకున్నదే జరుగుతోంది. ఏపీలో రాజకీయాలు భారీ స్థాయిలో వేడెక్కాయి. అనూహ్యమైన పరిణామంగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని టీడీపీ ఇప్పుడు ఊరూవాడా ప్రచారం చేయాలని నిర్ణయించింది .గత ఎన్నికలకు ముందు.. వివేకా హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ.. అప్పటి ఎన్నికల్లో ప్రజల నుంచిసానుభూతిని సొంతం చేసుకుంది.
ఫలితంగా.. వైసీపీ భారీ సంఖ్యలో ఓట్లు సీట్లు దక్కించుకుంది. ఇక, ఇప్పుడు అదే మంత్రాన్ని టీడీపీ జపి స్తోంది. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. అన్నీ కూడా వివేకానంద రెడ్డి హత్య.. దీనిలో సీఎం జగన్ పాత్ర.. నాటకం.. ఎలా రక్తి కట్టించారు? అనే విషయాల చుట్టూనే తిరిగాయి. అసలు ఈ కేసుతో జగన్కు సంబంధం ఉందని కూడా చంద్రబాబు వివరించారు.
మొత్తంగా చూస్తే.. టీడీపీ వివేకా కేసుతో దూకుడు పెంచిందనే తెలుస్తోంది. ఇలా..చంద్రబాబు ఈ విషయాన్ని అందిపుచ్చుకోగానే.. టీడీపీ అనుకూల మీడియాలోనూ వివేకానందరెడ్డి మరణంపై తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. తాజాగా సీబీఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం.. దీనిలో ఏం జరిగిందో కొంత చెప్పడం వంటి పరిణామాలు..ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా టీడీపీ ఇప్పుడు వివేకా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్న విషయం కూడా చర్చకు వస్తోంది. క్షేత్రస్థాయిలో జగన్ను ఎదిరించేందుకు ఉన్న అవకాశం ఇదేనని భావిస్తున్న టీడీపీ.. ఇక నుంచి ఆయనను రాజకీయంగానే కాకుండా నైతికంగా కూడా దెబ్బతీయాలని నిర్ణయించింది. మరి ఏమేరకు టీడీపీ సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on February 24, 2023 9:34 am
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…