అనుకున్నదే జరుగుతోంది. ఏపీలో రాజకీయాలు భారీ స్థాయిలో వేడెక్కాయి. అనూహ్యమైన పరిణామంగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని టీడీపీ ఇప్పుడు ఊరూవాడా ప్రచారం చేయాలని నిర్ణయించింది .గత ఎన్నికలకు ముందు.. వివేకా హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ.. అప్పటి ఎన్నికల్లో ప్రజల నుంచిసానుభూతిని సొంతం చేసుకుంది.
ఫలితంగా.. వైసీపీ భారీ సంఖ్యలో ఓట్లు సీట్లు దక్కించుకుంది. ఇక, ఇప్పుడు అదే మంత్రాన్ని టీడీపీ జపి స్తోంది. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. అన్నీ కూడా వివేకానంద రెడ్డి హత్య.. దీనిలో సీఎం జగన్ పాత్ర.. నాటకం.. ఎలా రక్తి కట్టించారు? అనే విషయాల చుట్టూనే తిరిగాయి. అసలు ఈ కేసుతో జగన్కు సంబంధం ఉందని కూడా చంద్రబాబు వివరించారు.
మొత్తంగా చూస్తే.. టీడీపీ వివేకా కేసుతో దూకుడు పెంచిందనే తెలుస్తోంది. ఇలా..చంద్రబాబు ఈ విషయాన్ని అందిపుచ్చుకోగానే.. టీడీపీ అనుకూల మీడియాలోనూ వివేకానందరెడ్డి మరణంపై తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. తాజాగా సీబీఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం.. దీనిలో ఏం జరిగిందో కొంత చెప్పడం వంటి పరిణామాలు..ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా టీడీపీ ఇప్పుడు వివేకా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్న విషయం కూడా చర్చకు వస్తోంది. క్షేత్రస్థాయిలో జగన్ను ఎదిరించేందుకు ఉన్న అవకాశం ఇదేనని భావిస్తున్న టీడీపీ.. ఇక నుంచి ఆయనను రాజకీయంగానే కాకుండా నైతికంగా కూడా దెబ్బతీయాలని నిర్ణయించింది. మరి ఏమేరకు టీడీపీ సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on February 24, 2023 9:34 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…