అనుకున్నదే జరుగుతోంది. ఏపీలో రాజకీయాలు భారీ స్థాయిలో వేడెక్కాయి. అనూహ్యమైన పరిణామంగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని టీడీపీ ఇప్పుడు ఊరూవాడా ప్రచారం చేయాలని నిర్ణయించింది .గత ఎన్నికలకు ముందు.. వివేకా హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ.. అప్పటి ఎన్నికల్లో ప్రజల నుంచిసానుభూతిని సొంతం చేసుకుంది.
ఫలితంగా.. వైసీపీ భారీ సంఖ్యలో ఓట్లు సీట్లు దక్కించుకుంది. ఇక, ఇప్పుడు అదే మంత్రాన్ని టీడీపీ జపి స్తోంది. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. అన్నీ కూడా వివేకానంద రెడ్డి హత్య.. దీనిలో సీఎం జగన్ పాత్ర.. నాటకం.. ఎలా రక్తి కట్టించారు? అనే విషయాల చుట్టూనే తిరిగాయి. అసలు ఈ కేసుతో జగన్కు సంబంధం ఉందని కూడా చంద్రబాబు వివరించారు.
మొత్తంగా చూస్తే.. టీడీపీ వివేకా కేసుతో దూకుడు పెంచిందనే తెలుస్తోంది. ఇలా..చంద్రబాబు ఈ విషయాన్ని అందిపుచ్చుకోగానే.. టీడీపీ అనుకూల మీడియాలోనూ వివేకానందరెడ్డి మరణంపై తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. తాజాగా సీబీఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం.. దీనిలో ఏం జరిగిందో కొంత చెప్పడం వంటి పరిణామాలు..ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా టీడీపీ ఇప్పుడు వివేకా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్న విషయం కూడా చర్చకు వస్తోంది. క్షేత్రస్థాయిలో జగన్ను ఎదిరించేందుకు ఉన్న అవకాశం ఇదేనని భావిస్తున్న టీడీపీ.. ఇక నుంచి ఆయనను రాజకీయంగానే కాకుండా నైతికంగా కూడా దెబ్బతీయాలని నిర్ణయించింది. మరి ఏమేరకు టీడీపీ సక్సెస్ అవుతుందో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…