వైఎస్ కుటుంబ విభేదాలు రోజుకొకటి బయట పడుతున్నాయి. తన మాట వినని షర్మిలను పూర్తిగా దూరం చేయాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రయత్నాల వెనుక జగన్ కంటే ఆయన భార్య భారతీరెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా తాజాగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు షర్మిల పేరే కనిపించకూడదన్నట్లుగా వైఎస్ భారతి ప్రయత్నిస్తున్నారన్నది తాజా సమాచారం . జగన్ తన తల్లిని, చెల్లిని దూరం పెట్టడంలో భారతి కీలక భూమిక పోషించినట్లు చెబుతున్నారు. షర్మిలను సపోర్టు చేసే వారిని సైతం ఎలా దెబ్బకొట్టాలో, ఎలా దూరంగా ఉంచాలో భారతి పెద్ద స్కెచే వేస్తున్నారట..
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానిగా ఉన్న కొర్రు భాస్కర్ రెడ్డి (కడప జిల్లా వాసి).. ప్రతీ ఏడాది జయంతి రోజున ఫుల్ పేజీ యాడ్స్ ఇస్తుంటారు. వైఎస్ పై అభిమానంతో ఇచ్చే యాడ్స్ సాక్షి పత్రికలో ప్రచురితమవుతుంటాయి.ఈ సారి మాత్రం యాడ్స్ తీసుకుని అంతా సెట్ అయిన తర్వాత వైఎస్ జయంతికి ఒక రోజు ముందు వాటిని సాక్షి యాజమాన్యం తిరస్కరించింది. యాడ్ లో షర్మిల ఫోటో ఉన్నందున వాటిని తీసుకోలేమని చెప్పేసింది. ఎందుకంటే భారతి వద్దన్నారని సాక్షి సిబ్బంది నేరుగానే చెప్పేశారు. దానితో కోపగించుకున్న కొర్రు భాస్కర్ రెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేర్వేరు సెక్షన్ల కింద కోర్టులో కేసు వేశారు. యాడ్ కోసం తాను చెక్కు కూడా ఇచ్చానని, రసీదు జారీ చేసిన తర్వాత ప్రకటన వేయలేమన్నారన్నది భాస్కర్ రెడ్డి ప్రధాన ఆరోపణ. సాక్షి ఛైర్మన్ భారతీ రెడ్డిపై ఆయన కేసు పెట్టారు.
భారతీ యాడ్స్ వ్యవహారం చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. ఇలాంటి చర్యల ద్వారా షర్మిలను మరింత దూరం పెట్టే ప్రక్రియ చాలా రోజులుగా జరుగుతోంది. అయితే దీని వెనుక బారతీ రెడ్డి ఉన్నారన్న సంగతి మాత్రం ఇప్పుడే బయటపడింది. వారసత్వంగా షర్మిలకు అందాల్సిన వైఎస్ ఆస్తిలో వాటాను కూడా ఆమెకు అందకుండా భారతి అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది. షర్మిల, విజయలక్ష్మీ ఇద్దరు హైదరాబాద్ లో సెటిలైపోవడానికి భారతే కారణమని చెబుతున్నారు. అసలు షర్మిల పేరెత్తితేనే భారతి ఇంతెత్తున ఎగిరిపడుతున్నారు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందే…
This post was last modified on February 21, 2023 9:09 am
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…
చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…
ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…
హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…