Political News

మంగ‌ళ‌గిరిలో గెలుపు ఎవ‌రిది… ఎవ‌రికి వారిదే ధీమా..!

గుంటూరు జిల్లాలో ఎక్క‌డ గెలిచినా.. గెల‌వ‌క‌పోయినా.. ఒకే ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం గెలిచి తీరాలి.. ఆ కిక్కే వేర‌ప్పా!! అంటున్నారు వైసీపీ, టీడీపీనాయ‌కులు. రెండుపార్టీల‌కు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం చాలా చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నారా లోకేష్‌ను గెలిపించుకోవాల‌ని.. టీడీపీ యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఇక్క‌డ చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇటీవ‌ల యువ గ‌ళం పాద‌యాత్ర ప్రారంభించ‌డానికి ముందు వ‌ర‌కు కూడా నారా లోకేష్ నియోజ‌క‌వ‌ర్గంలో వారానికి రెండు సార్లు ప‌ర్య‌టించారు. ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టారు.

అనేక మంది వీధి వ్యాపారుల‌కు సాయం కూడా అందించారు. ఇక‌, ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఆప‌న్న హ‌స్తం కూడా అందిస్తున్నారు. పైగా త‌న కేడ‌ర్‌ను కూడా ఇక్క‌డ ఏర్పాటు చేసుకుని, కార్యాలయంలోనేకాల్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక‌, నిన్న మొన్న‌టి వ‌ర‌కు నారా లోకేష్ ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇంటింటికీ తిరిగారు. అయితే.. ఇప్పుడు యువ‌గ‌ళం నేప‌థ్యంలో త‌న పార్టీ కీల‌క‌నాయ‌కుల‌ను ఇక్క‌డ దింపి.. ప్ర‌జ‌ల‌కు పార్టీకి మ‌ధ్య దూరం తెగిపోకుండా చూసుకుంటున్నారు. త‌ర‌చుగా.. ఇక్క‌డి ప‌రిస్థితినికూడా ఆయ‌న స‌మీక్షిస్తున్నారు.

మ‌రో వైపు చంద్ర‌బాబు కూడా మంగ‌ళ‌గిరిలో ఏం జ‌రుగుతున్నా తెలుసుకుంటున్నారు. పార్టీ నేత‌ల‌తో ఆయ‌న కూడా ట‌చ్‌లో ఉంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎదురైన ఓట‌మిని జ‌యించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. దీంతో గుంటూరులో ఏ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచినా.. గెల‌వ‌క‌పోయినా.. ఖ‌చ్చితంగా మంగ‌ళ‌గిరిలో మాత్రంవిజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని టీడీపీ నిర్ణ‌యించుకుంది. మ‌రోవైపు.. వైసీపీ కూడా అంతే ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇక్క‌డ ఆ పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు గెలుస్తారు? అనేది ప్ర‌ధానం కాదు.. నారా లోకేష్‌ను ఎలా ఓడించాల‌నేదే వైసీపీ వ్యూహంగా ఉంది.

వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి..గత ఎన్నిక‌ల్లో నారా లోకేష్‌ను ఓడించారు. మ‌రోసారి కూడా ఆయ నే ఇక్క‌డ నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంది. అయితే..ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితిని బ‌ట్టి.. అవ‌స‌ర‌మైతే.. ఆళ్ల‌ను మార్చే ప‌రిస్థితి కూడా ఉంద‌ని పార్టీలో చ‌ర్చ సాగుతోంది. “ఇక్క‌డ ఆళ్ల‌.. ఈళ్ల‌.. అని కాదు.. ఎవ‌రు పోటీ చేసినా.. నారా లోకేష్‌ను ఓడించ‌డ‌మే ధ్యేయం. దానికి ఎవ‌రు స‌రిపోతే వారికే టికెట్‌” అని కీల‌క నాయ‌కుడుఒక‌రు కామెంట్ చేయ‌డం.. గ‌మ‌నార్హం. దీంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ ప‌ట్టుద‌ల‌తో ద‌క్కించుకోవాల‌ని అనుకుంటున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మంగ‌ళ‌గిరి తొలిస్థానంలో ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

24 minutes ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

2 hours ago

మ్యాజిక్ చేయడానికి బుల్లితెరకు వెళ్తున్నారు

రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…

2 hours ago

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

3 hours ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

4 hours ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

4 hours ago