Political News

గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ దాడి!

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ క‌క్ష‌లు శ్రుతి మించాయి. టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విరుచుకుప‌డ్డారు. చేతికి అందిన రాళ్ల‌తో దాడుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ కార్యాల‌యానికి ఉన్న అద్దాలు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. ఇంత‌టితో కూడా ఊరుకోని కార్య‌క‌ర్త‌లు.. కార్యాల‌యంలో పార్కింగ్ చేసిన రెండు కార్లు, నాలుగు బైకుల‌కు కూడా నిప్పు పెట్టారు. అదేస‌మ‌యంలో కార్యాల‌యంలో ఎవ‌రైనా ఉన్నారేమో.. అనిలోప‌ల‌కు చొచ్చుకు వెళ్తే ప్ర‌య‌త్నం చేయ‌డం.. ఇంత‌లోనే టీడీపీ కార్య‌కర్త‌లు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకోవ‌డంతో మ‌రింత ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అస‌లు ఏం జ‌రిగింది?

టీడీపీ నేత‌లు కొంద‌రిని ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ బెదిరింపుల‌కు గురి చేస్తున్నార‌ని.. కొంద‌రు నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఇంకా ఎలాంటి కేసు న‌మోదు చేయ‌లేదు. అయితే.. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారానికి వ‌చ్చింది. దీంతో ఆగ్ర‌హోద‌గ్రులైన వైసీపీ నాయ‌కులు, ఎమ్మెల్యే వంశీ అనుచ‌రులు పెద్ద ఎత్తున టీడీపీ కార్యాల‌యంపై దాడికి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో వారికి అందివ‌చ్చిన వాటిని కార్యాల‌యంపై విసిరేశారు. అందేకాదు.. టీడీపీ నేత‌ల‌ను ప‌రుషంగా దూషిస్తూ.. ద‌మ్ముంటే బ‌య‌ట‌కు రండి అని స‌వాళ్లు రువ్వారు.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న వంశీ.. త‌ర్వాత వైసీపీలోకి చేరిన విష‌యం తెలిసిందే. దీంతో ఇక్క‌డ ఇంచార్జ్‌గా టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడును పార్టీ నియ‌మించింది. అయితే, ఆయ‌న అనారోగ్యం కార‌ణంగా..కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో కింది స్థాయి నాయ‌కులే పార్టీ కార్య‌క్ర‌మాలు చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వారిని వంశీ హెచ్చ‌రించార‌ని.. కార్య‌క‌ర్త‌లు పేర్కొంటున్నారు. పార్టీ కార్యాల‌యాన్ని శాశ్వ‌తంగా తొల‌గించాల‌ని కూడా హెచ్చ‌రించార‌ని పేర్కొన్నారు. దీంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కార‌ణంగానే వైసీపీ నాయ‌కులు.. టీడీపీ కార్యాల‌యంపై దాడి చేసి.. వాహ‌నాల‌కు నిప్పు పెట్టార‌ని స‌మాచారం.

This post was last modified on February 20, 2023 7:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

OTT రూటు… ఇది కరెక్టు పాయింటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన నాలుగు నిర్మాతల మండళ్లు ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో…

17 minutes ago

బడ్జెట్ 10 కోట్లు… వసూళ్లు 200 కోట్లు

మన దగ్గర మిడ్ రేంజ్ హీరోల మీద వంద కోట్ల బడ్జెట్లు పెట్టేస్తున్నారు నిర్మాతలు. తీరా చూస్తే తెర మీద…

51 minutes ago

నవ్వుల నాగ‌బాబు… జ‌బ‌ర్ద‌స్త్‌ను లేప‌గ‌ల‌డా?

తెలుగు టీవీ చ‌రిత్ర‌లోనే అత్యంత విజ‌య‌వంత‌మైన షోగా జ‌బ‌ర్ద‌స్త్‌ను చెప్పొచ్చు. అందులో డ‌బుల్ మీనింగ్‌లు, బాడీ షేమింగ్‌ల గురించి అభ్యంత‌రాలు…

1 hour ago

ప్రొడ్యూసర్ కిరణ్ సక్సెస్ అయినట్టేనా

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాను నటించకుండా నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. సుమారు నలభైకి పైగా కొత్తవాళ్లను పరిచయం…

4 hours ago

ఆదిత్య ధర్ స్టోరీలు అమ్మేసుకున్న ఫ్రెండు

ఆదిత్య ధర్.. గత నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. దురంధర్, దురంధర్-2 చిత్రాలతో అతను రేపిన సంచలనం అంతా…

4 hours ago

కేరళలో వివాదం చేసి తెలుగులో స్పందించిన నటుడు

ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…

5 hours ago