ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ కక్షలు శ్రుతి మించాయి. టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు విరుచుకుపడ్డారు. చేతికి అందిన రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయానికి ఉన్న అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంతటితో కూడా ఊరుకోని కార్యకర్తలు.. కార్యాలయంలో పార్కింగ్ చేసిన రెండు కార్లు, నాలుగు బైకులకు కూడా నిప్పు పెట్టారు. అదేసమయంలో కార్యాలయంలో ఎవరైనా ఉన్నారేమో.. అనిలోపలకు చొచ్చుకు వెళ్తే ప్రయత్నం చేయడం.. ఇంతలోనే టీడీపీ కార్యకర్తలు ఘటనా ప్రాంతానికి చేరుకోవడంతో మరింత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.
అసలు ఏం జరిగింది?
టీడీపీ నేతలు కొందరిని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెదిరింపులకు గురి చేస్తున్నారని.. కొందరు నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే.. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారానికి వచ్చింది. దీంతో ఆగ్రహోదగ్రులైన వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే వంశీ అనుచరులు పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయంపై దాడికి వచ్చారు. ఆ సమయంలో వారికి అందివచ్చిన వాటిని కార్యాలయంపై విసిరేశారు. అందేకాదు.. టీడీపీ నేతలను పరుషంగా దూషిస్తూ.. దమ్ముంటే బయటకు రండి అని సవాళ్లు రువ్వారు.
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం దక్కించుకున్న వంశీ.. తర్వాత వైసీపీలోకి చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఇంచార్జ్గా టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును పార్టీ నియమించింది. అయితే, ఆయన అనారోగ్యం కారణంగా..కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో కింది స్థాయి నాయకులే పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో వారిని వంశీ హెచ్చరించారని.. కార్యకర్తలు పేర్కొంటున్నారు. పార్టీ కార్యాలయాన్ని శాశ్వతంగా తొలగించాలని కూడా హెచ్చరించారని పేర్కొన్నారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కారణంగానే వైసీపీ నాయకులు.. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి.. వాహనాలకు నిప్పు పెట్టారని సమాచారం.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…