ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ కక్షలు శ్రుతి మించాయి. టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు విరుచుకుపడ్డారు. చేతికి అందిన రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయానికి ఉన్న అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంతటితో కూడా ఊరుకోని కార్యకర్తలు.. కార్యాలయంలో పార్కింగ్ చేసిన రెండు కార్లు, నాలుగు బైకులకు కూడా నిప్పు పెట్టారు. అదేసమయంలో కార్యాలయంలో ఎవరైనా ఉన్నారేమో.. అనిలోపలకు చొచ్చుకు వెళ్తే ప్రయత్నం చేయడం.. ఇంతలోనే టీడీపీ కార్యకర్తలు ఘటనా ప్రాంతానికి చేరుకోవడంతో మరింత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.
అసలు ఏం జరిగింది?
టీడీపీ నేతలు కొందరిని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెదిరింపులకు గురి చేస్తున్నారని.. కొందరు నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే.. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారానికి వచ్చింది. దీంతో ఆగ్రహోదగ్రులైన వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే వంశీ అనుచరులు పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయంపై దాడికి వచ్చారు. ఆ సమయంలో వారికి అందివచ్చిన వాటిని కార్యాలయంపై విసిరేశారు. అందేకాదు.. టీడీపీ నేతలను పరుషంగా దూషిస్తూ.. దమ్ముంటే బయటకు రండి అని సవాళ్లు రువ్వారు.
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం దక్కించుకున్న వంశీ.. తర్వాత వైసీపీలోకి చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఇంచార్జ్గా టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును పార్టీ నియమించింది. అయితే, ఆయన అనారోగ్యం కారణంగా..కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో కింది స్థాయి నాయకులే పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో వారిని వంశీ హెచ్చరించారని.. కార్యకర్తలు పేర్కొంటున్నారు. పార్టీ కార్యాలయాన్ని శాశ్వతంగా తొలగించాలని కూడా హెచ్చరించారని పేర్కొన్నారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కారణంగానే వైసీపీ నాయకులు.. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి.. వాహనాలకు నిప్పు పెట్టారని సమాచారం.
This post was last modified on February 20, 2023 7:24 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…