Political News

గెలిచిన గల్లా.. ఏపీ నిర్ణ‌యంపై సుప్రీం కోర్టు స్టే

టీడీపీ ఎంపీ, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గ‌ల్లా జ‌య‌దేవ్ న్యాయ పోరాటంలో ఒకింత తెరిపిన ప‌డ్డారు. చిత్తూరు శివారులోని గ‌ల్లా కుటుంబానికి చెందిన అమ‌ర‌రాజా బ్యాట‌రీస్ కంపెనీని మూసివేయాలంటూ.. ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన నోటీసులను సుప్రీం కోర్టు ప‌క్క‌న పెట్టింది. స‌ద‌రు నోటీసుల‌పై స్టే విధించింది. ఏపీ పీసీబీ షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు.. కంపెనీ మూసివేతపై హైకోర్టు స్టే ఆర్డర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో సుమారు ఏడాదికిపైగా న్యాయ పోరాటం చేసిన గ‌ల్లా ఒకింత విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టు అయింది.

అస‌లు ఏం జ‌రిగిందంటే..

అమరరాజా కంపెనీ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని ఏపీ కాలుష్య‌నియంత్ర‌ణ మండలి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పరిసర జలాల్లో లెడ్ పెరుగుతోందని మూసియాల‌ని కోరింది. కాగా, రాజకీయ కారణాలతో తమను వేధిస్తున్నారని అమరరాజా గ్రూపు అధినేత‌గా గ‌ల్లా జ‌య‌దేవ్ కోర్టును ఆశ్ర‌యించారు. షోకాజ్ నోటీసుపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరారు. దీనికి కోర్టు స‌మ్మ‌తించింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇచ్చే ఉత్తర్వులను 4 వారాలు నిలుపుదల చేయాలని సూచించింది. పీసీబీ నోటీసులపై న్యాయ పరిష్కారాల కోసం నిలుపుదల చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

అమరరాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ పీసీబీ షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు.. కంపెనీ మూసివేతపై హైకోర్టు స్టే ఆర్డర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇదిలావుంటే, ఏపీ ప్ర‌భుత్వం త‌మ‌ను ఏవిధంగా వేదిస్తున్న‌దీ అమ‌ర‌రాజా కంపెనీ సుప్రీంకోర్టులో ఏక‌రువు పెట్టింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తమ సంస్థకు ఇచ్చిన 253 ఎకరాల భూములను జ‌గ‌న్ ప్రభుత్వం 2020 జూన్‌ 30న వెనక్కి తీసేసుకుందని తెలిపారు.

ఈ కారణంతో అమరరాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించిన‌ట్టు చెప్పారు. ఒప్పందంలో పేర్కొన్న దానికంటే అధికంగా ఉపాధి కల్పించడమే గాక రూ.2,700కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామని విన్నవించారు. ఆ తర్వాత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మరింతగా పెరిగాయని వివ‌రించారు. 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడతల వారీగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేశారని, గాలిలో, మట్టిలో సీసం పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్టు వెల్లడించారని కోర్టుకు వివ‌రించారు.

అంతేగాకుండా ఉద్యోగుల రక్తంలోనూ పరిమితికి మంచి సీసం ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని చెప్పారు. నిబంధనలు పాటించడం లేదంటూ చిత్తూరు జిల్లా నూనెగుండ్లపల్లి, కరకంబాడిల్లో ఉన్న అమరరాజా బ్యాటరీ తయారీ యూనిట్లు మూసేయాలని పీసీబీ ఆదేశించింది. ఆ క్రమంలో 2021 మే 1న అమరరాజా బ్యాటరీస్‌ ఫ్యాక్టరీకి ఏకంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన‌ట్టు తెలిపారు.

This post was last modified on February 20, 2023 7:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

34 minutes ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

4 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

4 hours ago

మెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేట

మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…

5 hours ago

సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?

24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…

6 hours ago

శ్రీవిష్ణు సంకటం ఎవరికీ వద్దు

ఇమేజ్, మార్కెట్ ఉన్న హీరో సినిమాలు రెండు కేవలం ఒకే రోజు గ్యాప్ తో విడుదల కావడం చాలా ఇబ్బందికరమైన…

6 hours ago