రాబోయే వేసవి సీజన్లో మాస్ ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న మొదటి సినిమాగా దసరాకు క్రేజ్ అంతకంతా పెరుగుతోంది. ఆ మధ్య జరిగిన టీజర్ లాంచ్ లో నాని ఏకంగా దీన్ని కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప రేంజ్ లో ఉంటుందని ఊరించేయడంతో ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకుంటున్నారు. అయినా రిలీజయ్యాక ఫలితం మాట్లాడితే బాగుంటుంది కానీ ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో స్టేట్మెంట్లు ఇవ్వడమేంటని నెటిజెన్లు గట్టిగానే తగులుకున్నారు. ఇవి నాని దాకా వెళ్లాయి. నిన్న జరిగిన సాంగ్ రిలీజ్ వేడుకలో దీని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
బడ్జెట్ లో కానీ స్కేల్ లో కానీ పుష్ప కెజిఎఫ్ లాంటి వాటితో దసరాకు పోలిక ఉండదని ఇది కేవలం కంటెంట్ పరంగా ఆ స్థాయిలో విజయం సాధిస్తుందని చెప్పడమే తప్పించి మరో కారణం లేదని తేల్చి చెప్పాడు. ఈ వెర్షన్ కన్విసింగ్ గానే ఉంది. ఎందుకంటే కేవలం పదహరు కోట్లతో తీసిన కాంతార మూడు వందల కోట్లు వసూలు చేసినప్పుడు దసరా మీద ఆ మాత్రం నమ్మకం పెట్టుకోవడం న్యాయమే. కాకపోతే మరీ ఓవర్ ది బోర్డు మాటలు చెప్పకుండా వీలైనంత తక్కువ ప్రొఫైల్ లో హీరో ప్రమోట్ చేసుకుంటే బెటర్. పబ్లిసిటీని ఎలా పీక్స్ కు తీసుకెళ్ళాలో దర్శక నిర్మాతలు చూసుకుంటారు.
కెరీర్ లోనే మొదటిసారి ఊర మాస్ మేకోవర్ కు వెళ్లిన నాని దసరా వల్ల పెద్ద సవాళ్ళే ఎదురు కానున్నాయి. ముఖ్యంగా పీరియాడిక్ డ్రామాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కథను అల్లారు కాబట్టి వీలైనంత గొప్పగా ఆడియన్స్ ని మెప్పించాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా పైన చెప్పినట్టు పుష్పని కాపీ కొట్టారనే కామెంట్లు వచ్చి పడతాయి. వీటి సంగతి ఎలా ఉన్నా ఏరియాల వారీగా బిజినెస్ మాత్రం క్రేజీగా జరిగిపోతోంది. ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ ఆల్రెడీ కొనేసింది. నాని రేంజ్ కి మించి ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్ సులభంగా టేబుల్ ప్రాఫిట్స్ అందుకోబోతున్నారట.
This post was last modified on February 14, 2023 10:42 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…