వ్యక్తిగత జీవితంలో అయినా.. వృత్తిగత జీవితంలో అయినా.. ఇప్పుడు ఎవరూ సస్పెన్స్ కోరుకోవడం లేదు. ఏ సమస్య అయినా.. ఏ విషయం అయినా..ఫటాఫట్ తేలిపోవాలి.. ధనాధన్ సాకారం అయిపోవాలి. మరి వీటికే ఇంత ఉంటే.. మరి రాజకీయాల్లో మాత్రం నాయకులు ఎంతసేపని ఓపికగా ఉంటారు? ఎంతగా అని ఓర్పుగా ఉంటారు? కుదరదని.. స్పష్టం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు సెగ పెడుతుండగా.. పార్టీ నేతల్లో బీపీని పెంచేస్తోంది.
ఇంతకీ విషయం ఏంటంటే.. పలువురు సీనియర్లు.. వచ్చే ఎన్నికల్లో తమ తమ వారసులను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. వీరికి గతంలో చంద్రబాబు సైతం హామీ ఇచ్చారు. వచ్చేఎన్నికల్లో ఖచ్చితంగా సీట్లు ఖాయం.. మీరు రెడీగా ఉండండి.. బాదుడే బాదుడు కార్యక్రమాలు చేయండి.. అని చెప్పారు. దీంతో వారు రెచ్చిపోయారు. అధికారపార్టీపై విరుచుకుపడ్డారు. అయితే.. ఇప్పుడు ఎన్నికలకు సమయం వచ్చేసింది.
మరి చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఇదీ.. ఇప్పుడు పార్టీలోని కీలక నేతలకు బీపీ పెంచేస్తున్న విషయం. ఉదాహరణకు గుంటూరు జిల్లాను తీసుకుంటే.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వారసుడు రంగారావు, శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో కావలి ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ.. వంటివారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఆదేశం కోసం.. ఎదురు చూస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదీ లేనిదీ చెప్పడం లేదు.
పోనీ.. ఆయా నియోజకవర్గాల్లో వేరే వారిని ప్రకటించారా? అలా చేస్తే.. తమ దారి తాము చూసుకుంటామని కూడా నేతలు చెబుతున్నారు. ఇదీ చేయరు. దీంతో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో నాయకుల బీపీ జోరుగా పెరిగిపోతోంది. ఎన్నికలకు ఆరు మాసాల ముందు ప్రకటిస్తే..తమ పరిస్థితి ఏంటి? అనేది వీరి ఆవేదనగా ఉంది. మరి ఇప్పటికైనా.. చంద్రబాబు ఏదో ఒకటి తేల్చేస్తే.. బెటర్ కదా? అంటున్నారు నాయకులు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on February 14, 2023 10:11 am
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…