వ్యక్తిగత జీవితంలో అయినా.. వృత్తిగత జీవితంలో అయినా.. ఇప్పుడు ఎవరూ సస్పెన్స్ కోరుకోవడం లేదు. ఏ సమస్య అయినా.. ఏ విషయం అయినా..ఫటాఫట్ తేలిపోవాలి.. ధనాధన్ సాకారం అయిపోవాలి. మరి వీటికే ఇంత ఉంటే.. మరి రాజకీయాల్లో మాత్రం నాయకులు ఎంతసేపని ఓపికగా ఉంటారు? ఎంతగా అని ఓర్పుగా ఉంటారు? కుదరదని.. స్పష్టం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు సెగ పెడుతుండగా.. పార్టీ నేతల్లో బీపీని పెంచేస్తోంది.
ఇంతకీ విషయం ఏంటంటే.. పలువురు సీనియర్లు.. వచ్చే ఎన్నికల్లో తమ తమ వారసులను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. వీరికి గతంలో చంద్రబాబు సైతం హామీ ఇచ్చారు. వచ్చేఎన్నికల్లో ఖచ్చితంగా సీట్లు ఖాయం.. మీరు రెడీగా ఉండండి.. బాదుడే బాదుడు కార్యక్రమాలు చేయండి.. అని చెప్పారు. దీంతో వారు రెచ్చిపోయారు. అధికారపార్టీపై విరుచుకుపడ్డారు. అయితే.. ఇప్పుడు ఎన్నికలకు సమయం వచ్చేసింది.
మరి చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఇదీ.. ఇప్పుడు పార్టీలోని కీలక నేతలకు బీపీ పెంచేస్తున్న విషయం. ఉదాహరణకు గుంటూరు జిల్లాను తీసుకుంటే.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వారసుడు రంగారావు, శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో కావలి ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ.. వంటివారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఆదేశం కోసం.. ఎదురు చూస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదీ లేనిదీ చెప్పడం లేదు.
పోనీ.. ఆయా నియోజకవర్గాల్లో వేరే వారిని ప్రకటించారా? అలా చేస్తే.. తమ దారి తాము చూసుకుంటామని కూడా నేతలు చెబుతున్నారు. ఇదీ చేయరు. దీంతో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో నాయకుల బీపీ జోరుగా పెరిగిపోతోంది. ఎన్నికలకు ఆరు మాసాల ముందు ప్రకటిస్తే..తమ పరిస్థితి ఏంటి? అనేది వీరి ఆవేదనగా ఉంది. మరి ఇప్పటికైనా.. చంద్రబాబు ఏదో ఒకటి తేల్చేస్తే.. బెటర్ కదా? అంటున్నారు నాయకులు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on February 14, 2023 10:11 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…