ఎంతైనా డాన్సుల గురించి చెప్పుకోవాలంటే మన సౌత్ హీరోల తర్వాతే ఎవరైనా. చిరంజీవితో మొదలుపెట్టి ఇప్పటి చరణ్ తారక్ బన్నీ ఇలా ఎవరిని తీసుకున్నా వీళ్ళ స్పీడు ముందు ఎవరైనా దిగదుడుపే. రామ్ సైతం ఈ విషయంలోనే మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అయితే బాలీవుడ్ బ్యాచ్ మాత్రం దశాబ్దాల తరబడి ఇందులో మాత్రం వెనుకాడే ఉంది. దిలీప్ కుమార్, రాజ్ కపూర్, అమితాబ్ బచ్చన్, ముగ్గురు ఖాన్లు, అక్షయ్ కుమార్ ఇలా ఎందరు వచ్చినా మన గ్రేస్ లో కనీసం సగం కూడా అందుకోలేకపోయారు.
ఒక్క హృతిక్ రోషన్ మాత్రమే మినహాయింపుగా చెప్పాలి. ఇటీవలి కాలంలో టైగర్ శ్రోఫ్, రణ్వీర్ సింగ్ లాంటి వాళ్ళు బాగానే ట్రై చేస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే సల్మాన్ ఖాన్ కొత్త సినిమా కిసీకా భాయ్ కిసీకా జాన్ ఈ ఏడాది రంజాన్ కానుకగా రిలీజయ్యేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టారు. హీరోయిన్ అన్నయ్యగా వెంకటేష్ ఓ కీలక పాత్ర చేయడంతో విక్టరీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది కానీ అదెంతవరకు నిజమో బొమ్మ చూస్తే కానీ చెప్పలేం.
ఈ మూవీ నుంచి తాజాగా నైయో లగ్దా అనే పాటను విడుదల చేశారు. పూజా హెగ్డే కండల వీరుడి జోడిగా నటించింది. ఇందులో సల్మాన్ వేసిన ఒక స్టెప్పు మంచి ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయింది. సుతారంగా కిందకు కూర్చుని మళ్ళీ పైకి లేస్తూ ఏదో హిట్లర్ టైపులో ట్రై చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. పైగా దానికి తోడు జులపాల జుట్టుతో విగ్గేసుకుని ట్రై చేసిన కొత్త లుక్ కూడా ఏమంత ఆకర్షణీయంగా లేదు. మొత్తానికి సౌత్ సినిమాల ట్రాప్ లో పడిపోయిన సల్మాన్ కథలు పాత్రలతో పాటు ఆఖరికి డాన్సులు కూడా కాపీ చేస్తే ఎలా అని నెటిజెన్లు దెప్పిపొడుస్తున్నారు. నిజాన్ని ఎవరు మాత్రం కాదనగలరు.
This post was last modified on February 14, 2023 3:06 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…