శ్రీలంకలో తమిళుల కోసం 1980లలో ఏర్పడిన మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ). తమిళనాడులో తమిళ వీరాభిమానులంతా ఎల్టీటీఈకి మద్దతిచ్చేవారు. 1991 ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఎల్టీటీఈ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినా తమిళ అభిమానులు మాత్రం ఆ ఉగ్రవాద సంస్థకు మద్దతిస్తూనే ఉన్నారు..
ఇప్పుడు నెడుమారన్..
తమిళనాడులో నెడుమారన్ అనే నాయకుడు ఉన్నారు.తొలినాళ్లలో ఆయన కాంగ్రెస్ లో ఉండే వారు. తర్వాత తమిళ జాతీయవాదిగా చెప్పుకుంటూ స్వచ్ఛంద సంస్థను నడుపుకుంటున్నారు. ఇప్పుడాయన ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ బతికే ఉన్నాడని చెబుతున్నారు. నిజానికి 2009 మేలో ప్రభాకరన్ ను చంపేసినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఎల్టీటీఈ మొత్తం తుడిచి పెట్టుకుపోయినట్లు వెల్లడించింది. అయినా తమిళనాడులో అప్పుడప్పుడు ప్రభాకరన్ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా నెడుమారన్ ఒక ప్రకటన చేస్తూ ప్రభాకరన్ బతికే ఉన్నాడని చెప్పారు. పైగా ప్రభాకరన్ కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ ప్రకటన చేస్తున్నానన్నారు…
తమిళనాడులో జోష్
నెడుమారన్ ప్రకటనతో తమిళనాడులో మళ్లీ జోష్ కనిపిస్తోంది. నెడుమారన్ ప్రకటనను కొందరు తమిళ జాతీయవాదులు స్వాగతించారు. నిజం కాకపోతే నెడుమారన్ అలాంటి మాటలు చెప్పరని విశ్లేషించారు. నెడుమారన్ నిత్యం ఎల్టీటీఈ కేడర్ తో టచ్ లో ఉంటారని చెప్పుకుంటున్నారు. దీనిపై అప్పుడే టీవీ చర్చలు మొదలు పెట్టేశారు. అదే మరి తమిళనాడు అంటే..
This post was last modified on February 13, 2023 11:18 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…