శ్రీలంకలో తమిళుల కోసం 1980లలో ఏర్పడిన మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ). తమిళనాడులో తమిళ వీరాభిమానులంతా ఎల్టీటీఈకి మద్దతిచ్చేవారు. 1991 ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఎల్టీటీఈ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినా తమిళ అభిమానులు మాత్రం ఆ ఉగ్రవాద సంస్థకు మద్దతిస్తూనే ఉన్నారు..
ఇప్పుడు నెడుమారన్..
తమిళనాడులో నెడుమారన్ అనే నాయకుడు ఉన్నారు.తొలినాళ్లలో ఆయన కాంగ్రెస్ లో ఉండే వారు. తర్వాత తమిళ జాతీయవాదిగా చెప్పుకుంటూ స్వచ్ఛంద సంస్థను నడుపుకుంటున్నారు. ఇప్పుడాయన ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ బతికే ఉన్నాడని చెబుతున్నారు. నిజానికి 2009 మేలో ప్రభాకరన్ ను చంపేసినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఎల్టీటీఈ మొత్తం తుడిచి పెట్టుకుపోయినట్లు వెల్లడించింది. అయినా తమిళనాడులో అప్పుడప్పుడు ప్రభాకరన్ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా నెడుమారన్ ఒక ప్రకటన చేస్తూ ప్రభాకరన్ బతికే ఉన్నాడని చెప్పారు. పైగా ప్రభాకరన్ కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ ప్రకటన చేస్తున్నానన్నారు…
తమిళనాడులో జోష్
నెడుమారన్ ప్రకటనతో తమిళనాడులో మళ్లీ జోష్ కనిపిస్తోంది. నెడుమారన్ ప్రకటనను కొందరు తమిళ జాతీయవాదులు స్వాగతించారు. నిజం కాకపోతే నెడుమారన్ అలాంటి మాటలు చెప్పరని విశ్లేషించారు. నెడుమారన్ నిత్యం ఎల్టీటీఈ కేడర్ తో టచ్ లో ఉంటారని చెప్పుకుంటున్నారు. దీనిపై అప్పుడే టీవీ చర్చలు మొదలు పెట్టేశారు. అదే మరి తమిళనాడు అంటే..
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…