Political News

మా మంత్రి అవినీతి రాయుడు.. వైసీపీలో రోడ్డెక్కిన వివాదం!!

వైసీపీ నేత‌లకు ప్ర‌తిప‌క్షాల‌తో ప‌నిలేకుండా పోయింది. ఎందుకంటే.. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేల‌కు.. మంత్రుల‌కు సొంత పార్టీలోనే కేడ‌రే కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ కేడ‌ర్‌.. పార్టీ నాయ‌కుల‌కు చుక్క‌లు చూపిస్తోంది. మా నాయ‌కులే అవినీతికి పాల్ప‌డుతున్నారంటూ.. కేడ‌ర్‌లోని కీల‌క కార్య‌క‌ర్త‌లు.. ముఖ్యులు రోడ్డెక్కుతున్న‌ప‌రిస్థితి రోజు రోజు కు పెరుగుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి డాక్ట‌ర్ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుపై సొంత పార్టీ నాయ‌కులు.. తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. “మా మంత్రి అవినీతి రాయుడు” అంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు.

వాస్త‌వానికి శ్రీకాకుళం జిల్లా ప‌లాస నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యంద‌క్కించుకున్న డాక్ట‌ర్ సీదిరికి రెండో సారి కేబినెట్ క‌న్నా ముందుగానే సీఎం జ‌గ‌న్ అవ‌కాశం క‌ల్పించారు. అయితే.. ఆయ‌న మంత్రి అయిన త‌ర్వాత‌.. పార్టీలో ఒక‌వైపే చూస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఒక వ‌ర్గం వారికి మాత్ర‌మే ఆయ‌న ప‌నులు చేస్తున్నార‌ని.. త‌మ‌ను అణిచేస్తున్నార‌ని మ‌రో వ‌ర్గం నాయకులు గ‌త ఏడాది వ‌న భోజ‌నాల స‌మ‌యంలోనే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు. అయిన‌ప్ప‌టికీ.. అధిష్టానం ప‌ట్టించుకోక పోవ‌డంతో ఇప్పుడు ఏకంగా రోడ్డెక్కేశారు.

ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అసమ్మతి నేతలు దువ్వాడ హేంబాబు చౌదరి, దువ్వాడ శ్రీకాంత్, జుత్తు నీలకంఠంలు కొన్నాళ్లు గా మంత్రి సీదిరిపై గుస్సాగా ఉన్నారు. ఆయ‌న త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నార‌ని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై నిజ నిర్దారణ కమిటీ వేసి, గ్రామాల్లో తిరిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామని వెల్లడించారు. ఆ నివేదికను జిల్లా నేతలతో పాటు సీఎం జగన్కు పంపిస్తామని వెల్లడించారు.

‘పలాస నియోజకవర్గంలో వైసీపీపై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు చేస్తున్నారు. అసలు కారణాలపై మేము ఓ నిజనిర్దారణ కమిటీ వేసి ప్రతి గ్రామానికి వెళ్తాం. వైసీపీలో ఎవ్వరూ అవినీతి చేసినా.. అది మా పార్టీకి ఇబ్బందే అందుకోసం ప్రతి గ్రామానికి వెళ్లేందు ప్రయత్నిస్తాం. వారు చెప్పె సలహాలు సూచనలు తీసుకుంటాం. జగన్ 2011 నుంచి ఇప్పటివరకు పార్టీ తరఫున ఎలాంటి పిలుపు ఇచ్చినా చేశాం. మా పార్టీలో అవినీతి జరగకుడండా చూడటం కోసమే మేమంతా గ్రామాల్లో ప్రయత్నిస్తాం. అవినీతి జరిగినట్లు తెలిస్తే.. ఆ వివరాలు జిల్లా నాయకులతో పాటుగా… మా అధినేత జగన్కు సైతం వివరాలు పంపిస్తాం.’ అని వారు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on February 11, 2023 7:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

54 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago