Political News

అప్పుడు ముద్దులు.. ఇప్పుడు గుద్దులు..

యువ‌గ‌ళం పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ .. సీఎం జ‌గ‌న్‌పై స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు ముద్దులు పెట్టాడ‌ని.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గుద్దులు గుద్దుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పదో రోజు యువ‌గ‌ళం పాదయాత్ర కొనసాగింది.

ఆదివారం ఉదయం తవనంపల్లె నుంచి ప్రారంభమైన యాత్ర.. తవనంపల్లె, ఐరాల మండలాల మీదగా సాగింది. కాణిపాకంలో ముస్లిం మైనారిటీలతో లోకేష్ భేటీ అయ్యారు. తొలుత ఆయ‌న వినాయ‌కుడి గుడిలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ముస్లింల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ముస్లింల‌ను రాజకీయంగా ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ముస్లింలపై బనాయించిన అక్రమ కేసులను టీడీపీ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో ఎత్తి వేస్తామని లోకేశ్‍ హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టిన జగన్‍.. అధికారంలోకి వచ్చాక పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నాడని విమ‌ర్శించారు. కాగా, పాదయాత్రలో నారా లోకేష్‌కు మహిళలు హరతులు పట్టి స్వాగ‌తం ప‌లికారు. టీడీపీ శ్రేణులు అడుగడుగునా పూలమాలలు వేస్తూ జేజేలు కొట్టారు. అనంతరం తవణంపల్లి విడిది కేంద్రంలో గాండ్ల సామాజిక వర్గీయులతో నారా లోకేష్‌ సమావేశమయ్యారు. కష్టజీవులైన గాండ్ల కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని.. టీడీపీ అధికారంలోకి తేవడానికి మీ వంతు సహకారం అందించాలని వారిని కోరారు.

తవణంపల్లి వద్ద ప్రజలతో మాట్లాడిన లోకేష్‌ సీఎం బయటకు వస్తే పరదాల మాటున ఉంటున్నాడని.. ప్రజలని చూస్తే భయం.. సీబీఐని చూస్తే ఇంకా ఎక్కువ భయపడుతున్నాడన్నారు. బాబాయిని చంపింది అబ్బాయేనని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. యువతకు భవిష్యత్ బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా సైకో పోయి.. సైకిల్ రావాలి అని పిలుపునిచ్చారు.

స్థానిక హైస్కూల్ లో కనీసం మౌలిక సదుపాయాలు లేవని.. కానీ నాడు – నేడు అంటూ హడావిడి చేయడం తప్ప అభివృద్ది లేదన్నారు. ప్రజల్లోకి వచ్చినందుకు నాపై కేసులు పెడుతున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా బెదరం, భయపడమన్నారు. కొడాలి నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని.. నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు.

రాష్ట్ర అభివృద్ధి ఎవరు చేశారో.. పరిశ్రమలు పక్క రాష్ట్రానికి ఎవరు తరిమారో చర్చించడానికి సిద్దమా అని లోకేష్‌ సవాల్‍ విసిరారు. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ మంత్రి అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. అడుగడుగునా వైసీపీ నేతలను చెప్పులతో కొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు.

This post was last modified on February 5, 2023 10:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

58 minutes ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

1 hour ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

1 hour ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago