Political News

అప్పుడు ముద్దులు.. ఇప్పుడు గుద్దులు..

యువ‌గ‌ళం పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ .. సీఎం జ‌గ‌న్‌పై స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు ముద్దులు పెట్టాడ‌ని.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గుద్దులు గుద్దుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పదో రోజు యువ‌గ‌ళం పాదయాత్ర కొనసాగింది.

ఆదివారం ఉదయం తవనంపల్లె నుంచి ప్రారంభమైన యాత్ర.. తవనంపల్లె, ఐరాల మండలాల మీదగా సాగింది. కాణిపాకంలో ముస్లిం మైనారిటీలతో లోకేష్ భేటీ అయ్యారు. తొలుత ఆయ‌న వినాయ‌కుడి గుడిలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ముస్లింల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ముస్లింల‌ను రాజకీయంగా ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ముస్లింలపై బనాయించిన అక్రమ కేసులను టీడీపీ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో ఎత్తి వేస్తామని లోకేశ్‍ హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టిన జగన్‍.. అధికారంలోకి వచ్చాక పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నాడని విమ‌ర్శించారు. కాగా, పాదయాత్రలో నారా లోకేష్‌కు మహిళలు హరతులు పట్టి స్వాగ‌తం ప‌లికారు. టీడీపీ శ్రేణులు అడుగడుగునా పూలమాలలు వేస్తూ జేజేలు కొట్టారు. అనంతరం తవణంపల్లి విడిది కేంద్రంలో గాండ్ల సామాజిక వర్గీయులతో నారా లోకేష్‌ సమావేశమయ్యారు. కష్టజీవులైన గాండ్ల కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని.. టీడీపీ అధికారంలోకి తేవడానికి మీ వంతు సహకారం అందించాలని వారిని కోరారు.

తవణంపల్లి వద్ద ప్రజలతో మాట్లాడిన లోకేష్‌ సీఎం బయటకు వస్తే పరదాల మాటున ఉంటున్నాడని.. ప్రజలని చూస్తే భయం.. సీబీఐని చూస్తే ఇంకా ఎక్కువ భయపడుతున్నాడన్నారు. బాబాయిని చంపింది అబ్బాయేనని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. యువతకు భవిష్యత్ బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా సైకో పోయి.. సైకిల్ రావాలి అని పిలుపునిచ్చారు.

స్థానిక హైస్కూల్ లో కనీసం మౌలిక సదుపాయాలు లేవని.. కానీ నాడు – నేడు అంటూ హడావిడి చేయడం తప్ప అభివృద్ది లేదన్నారు. ప్రజల్లోకి వచ్చినందుకు నాపై కేసులు పెడుతున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా బెదరం, భయపడమన్నారు. కొడాలి నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని.. నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు.

రాష్ట్ర అభివృద్ధి ఎవరు చేశారో.. పరిశ్రమలు పక్క రాష్ట్రానికి ఎవరు తరిమారో చర్చించడానికి సిద్దమా అని లోకేష్‌ సవాల్‍ విసిరారు. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ మంత్రి అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. అడుగడుగునా వైసీపీ నేతలను చెప్పులతో కొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు.

This post was last modified on February 5, 2023 10:10 pm

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

2 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

2 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

2 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

4 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

5 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

6 hours ago