ఏపీలో నిఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన ఎస్టీ నియోజకవర్గం పోలవరం. ఇక్కడ కాంగ్రెస్ సంస్థాగత ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే 2004, 2009 వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దక్కించుకుంది. తర్వాత.. చంద్రబాబు దూకుడు, ఆయన చేసిన వస్తున్నా మీకోసం యాత్ర కారణంగా ఇక్కడ పార్టీ పుంజుకుంది. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో మొడియం శ్రీనివాసరావు విజయం దక్కించుకు న్నారు.
పార్టీ అధికారంలోకి రావడంతో.. మొడియం గెలిచీ గెలవగానే గల్లా పెట్టె తెరిచేశారని అప్పట్లో పెద్ద వివాదం తెరమీదికి వచ్చింది. అంతేకాదు..తాను తీసుకునే ముడుపుల్లో తనకొక్కడికే కాదని.. ఎంతో మందికి వాటా ఉందని.. మీడియా మిత్రులకు కూడా ఇచ్చానని 2015లో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర డ్యామేజీ చేశాయి. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న అప్పటి సీఎం చంద్రబాబు ఆయనను కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండాలని హెచ్చరించారు.
తర్వాత ఏమైందో ఏమో.. 2019 ఎన్నికల సమయానికి మొడియం అడ్రస్ కనిపించలేదు. ఈ క్రమంలోనే బొరగం శ్రీనివాసరావు అనే మరో నాయకుడికి టికెట్ ఇచ్చారు. అయితే, ఈయన ప్రభావం ఇక్కడ కనిపించలేదు. దీంతో భారీ మెజారిటీతో వైసీపీ నాయకుడు తెల్లం బాలరాజు విజయం దక్కించుకున్నారు. కట్ చేస్తే.. వైసీపీ విధానాలు కావొచ్చు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకపోవడం కావొచ్చు.. ఏదైనా కూడా ఇక్కడ వైసీపీ హవా తగ్గింది.
ఈ నేపథ్యంలో వైసీపీ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ అవకాశం దక్కింది. కానీ, ఆదిశగా పార్టీ ప్రయత్నాలు చేయడం లేదు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో తమకంటే తమకే టికెట్ దక్కుతుందని మొడియం వర్సెస్ బొరగంల మధ్య రాజకీయ యుద్ధం సాగుతోంది. పోనీ.. పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? అంటే అది కూడా లేదు. దీంతో వైసీపీ వ్యతిరేకత ఉన్నప్పటికీ.. దానిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిని ఈ నేతలు చేయకపోవడం గమనార్హం.
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…