సంక్రాంతి సినిమాల విడుదల తేదీల గురించి జనవరి ప్రారంభంలో జరిగిన రచ్చ చర్చా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య జనవరి 13 రావడం పట్ల మెగాభిమానులు ముందు నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు వంద కోట్ల షేర్ తో రెండో వారంలోనూ మెగాస్టార్ దూకుడు మాములుగా లేదు. వీరసింహారెడ్డి నుంచి వచ్చిన పోటీని, థియేటర్ల కౌంట్ తగ్గడం వల్ల ఎదురైన ప్రతికూలతని ఈజీగా దాటేసింది. 11నే రావాల్సిందని తెగ ఫీలైన ఫ్యాన్స్ ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. ఒకవేళ ఫలితం తేడా కొట్టి ఉంటే అప్పుడా నిందని మెగాస్టార్ తో మైత్రి సంస్థ మోయాల్సి వచ్చేది.
వారసుడుని ముందు అనుకున్న డేట్ కంటే మూడు రోజులు ఆలస్యంగా అందరికంటే చివరిగా 14కి రిలీజ్ చేయడం నిర్మాత దిల్ రాజుకు చాలా ప్లస్ అయ్యింది. తమిళ వెర్షన్ టాక్ తాలూకు ప్రభావం తెలుగులో ఉంటుందని తెలిసినా కూడా రిస్క్ తీసుకున్నారు. ఒకవేళ 11నే వస్తే తర్వాత చిరంజీవి బాలకృష్ణ చిత్రాలకు వచ్చే టాక్ ఇబ్బందిగా మారుతుందని ముందే గుర్తించి దానికి అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకున్నారు. కట్ చేస్తే రొటీన్ టాక్, సోసో రివ్యూలతో కూడా విజయ్ బ్రేక్ ఈవెన్ అందుకునేలా ఉన్నాడు. బాక్సాఫీస్ వద్ద అనూహ్య పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇవి ఉదాహరణ.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. లేట్ వచ్చినా త్వరగా వచ్చినా ఫలితాలను ముందస్తుగా అంచనా వేయడం అంత సులభం కాదు. ఒకవేళ కంటెంట్ కనక జనానికి సరిగ్గా కనెక్ట్ అయితే కౌంట్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వచ్చి పడతాయనే క్లారిటీ వచ్చేసింది. ఇది ఈ పండగ సీజన్ కు మాత్రమే కాదు అన్నిసార్లు వర్తిస్తుంది. రాబోయే వేసవిలో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అయ్యే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. దసరాకు దీపావళికి క్లాషులు తప్పవు. ఒకే రోజు తలపడకుండా ముందు వెనుక అడ్జస్ మెంట్లు చేసుకోవడం మేలే జరుగుతుందని వీరయ్య వారసుడు నిరూపించాయి.
This post was last modified on January 22, 2023 11:53 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…