సంక్రాంతి సినిమాల విడుదల తేదీల గురించి జనవరి ప్రారంభంలో జరిగిన రచ్చ చర్చా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య జనవరి 13 రావడం పట్ల మెగాభిమానులు ముందు నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు వంద కోట్ల షేర్ తో రెండో వారంలోనూ మెగాస్టార్ దూకుడు మాములుగా లేదు. వీరసింహారెడ్డి నుంచి వచ్చిన పోటీని, థియేటర్ల కౌంట్ తగ్గడం వల్ల ఎదురైన ప్రతికూలతని ఈజీగా దాటేసింది. 11నే రావాల్సిందని తెగ ఫీలైన ఫ్యాన్స్ ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. ఒకవేళ ఫలితం తేడా కొట్టి ఉంటే అప్పుడా నిందని మెగాస్టార్ తో మైత్రి సంస్థ మోయాల్సి వచ్చేది.
వారసుడుని ముందు అనుకున్న డేట్ కంటే మూడు రోజులు ఆలస్యంగా అందరికంటే చివరిగా 14కి రిలీజ్ చేయడం నిర్మాత దిల్ రాజుకు చాలా ప్లస్ అయ్యింది. తమిళ వెర్షన్ టాక్ తాలూకు ప్రభావం తెలుగులో ఉంటుందని తెలిసినా కూడా రిస్క్ తీసుకున్నారు. ఒకవేళ 11నే వస్తే తర్వాత చిరంజీవి బాలకృష్ణ చిత్రాలకు వచ్చే టాక్ ఇబ్బందిగా మారుతుందని ముందే గుర్తించి దానికి అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకున్నారు. కట్ చేస్తే రొటీన్ టాక్, సోసో రివ్యూలతో కూడా విజయ్ బ్రేక్ ఈవెన్ అందుకునేలా ఉన్నాడు. బాక్సాఫీస్ వద్ద అనూహ్య పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇవి ఉదాహరణ.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. లేట్ వచ్చినా త్వరగా వచ్చినా ఫలితాలను ముందస్తుగా అంచనా వేయడం అంత సులభం కాదు. ఒకవేళ కంటెంట్ కనక జనానికి సరిగ్గా కనెక్ట్ అయితే కౌంట్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వచ్చి పడతాయనే క్లారిటీ వచ్చేసింది. ఇది ఈ పండగ సీజన్ కు మాత్రమే కాదు అన్నిసార్లు వర్తిస్తుంది. రాబోయే వేసవిలో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అయ్యే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. దసరాకు దీపావళికి క్లాషులు తప్పవు. ఒకే రోజు తలపడకుండా ముందు వెనుక అడ్జస్ మెంట్లు చేసుకోవడం మేలే జరుగుతుందని వీరయ్య వారసుడు నిరూపించాయి.
This post was last modified on January 22, 2023 11:53 am
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…