Movie News

ఇక్కడ ఇన్ని సినిమాలు చేస్తూ.. అక్కడ కూడా

తెలుగులో ప్రస్తుతం సినిమాల సంఖ్య, వాటి స్కేల్ పరంగా చూస్తే అతి పెద్ద నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనే చెప్పాలి. ఈ సంక్రాంతికి ఒకేసారి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి భారీ చిత్రాలను రిలీజ్ చేసిందంటే ఆ సంస్థ జోరెలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఆ సంస్థ జోరు ముందు దిల్ రాజు సైతం కొంచెం వెనుకబడుతున్నాడంటే వారి దూకుడు ఎలా సాగుతోందో తెలిసిపోతుంది. చిన్న, పెద్ద, మీడియం.. ఇలా రకరకాల రేంజిల్లో సినిమాలు నిర్మిస్తూ దూసుకెళ్తోంది మైత్రీ సంస్థ.

ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప-2’ లాంటి క్రేజీ ప్రాజెక్టుతో పాటు మరి కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రీ.. మలయాళంలో కూడా ఓ క్రేజీ సినిమా చేస్తుండడం విశేషం. ప్రస్తుతం మాలీవుడ్లో మంచి ఊపు మీదున్న యువ కథానాయకుడు టొవినో థామస్‌తో మైత్రీ వాళ్లు సినిమా తీస్తున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా లాంచ్ చేశారు.

నడికర్ తిలగం.. మైత్రీ వారి తొలి మలయాళ సినిమా టైటిల్ ఇది. అంటే నట తిలకం అని అర్థం. తమిళంలో లెజెండరీ నటుడు శివాజీ గణేషన్‌కు ఇదే బిరుదు ఉండేది. ‘మహానటి’ తమిళ వెర్షన్‌కు ఈ పేరే పెట్టారు.

ఇప్పుడు మలయాళంలో ఈ పేరు పెట్టి మైత్రీ వాళ్లు ఒక వయొలెంట్ సినిమా తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఫస్ట్ లుక్‌లో శిలువ వేసి ఉన్న హీరోను వయొలెంట్‌గానే చూపించారు. ఈ చిత్రాన్ని అక్కడి స్టార్ డైరెక్టర్లలో ఒకడైన లాల్ జూనియర్ రూపొందిస్తున్నాడు.

అతను ‘డ్రైవింగ్ లైసెన్స్’ లాంటి సూపర్ హిట్ తర్వాత తీస్తున్న సినిమా ఇది. టొవినో, లాల్ లాంటి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అక్కడ మంచి అంచనాలే ఉన్నట్లున్నాయి. ఈ సినిమా అంచనాలకు తగ్గ విజయం అందుకుంటే మలయాళంలో మైత్రీ వారి నుంచి మరిన్ని సినిమాలు రాబోతున్నట్లే. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on January 22, 2023 8:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

19 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

2 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago