Political News

ఏం చూసి మిడిసిపాటు.. వైసీపీ ఎమ్మెల్యేకు అధిష్టానం వార్నింగ్‌!

వైసీపీ అధిష్టానం.. ఒక ఎమ్మెల్యేపై చాలా సీరియ‌స్ అయింద‌నే ప్ర‌చారం తాడేప‌ల్లి వ‌ర్గాల్లో సాగుతోంది. ఇటీవ‌లే..ఈయ‌న‌ను స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ త‌న నివాసానికి పిలిచి మ‌రీ వార్నింగ్ ఇచ్చారు. అయిన‌ప్ప‌టి కీ.. ఆయ‌న‌లో మార్పు రాక‌పోవ‌డంతో తాజాగా కీల‌క స‌ల‌హాదారు ఒక‌రు.. స్వ‌యంగా ఫోన్ చేసి.. ఏం చూసి మిడిసిపాటు? అని ప్ర‌శ్నించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన స‌ద‌రు ఎమ్మెల్యే గ‌త ఎన్నిక‌ల్లో అనూహ్యంగా టీడీపీ నుంచి వ‌చ్చి.. వైసీపీ లో చేరారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపుగుర్రం ఎక్కారు. కొన్నాళ్లుగా సొంత పార్టీ మంత్రి తో విభేదిస్తున్న ఆయ‌న‌.. త‌ర‌చుగా.. వివాదాల‌కు కేంద్రంగా మారారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా మాట్లాడి.. నోరు అదుపులో పెట్టుకోవాల‌ని.. సూచించార‌ని.. పార్టీ కోసం ప‌నిచేయాల‌ని సూచించిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

అయితే.. ఇంత‌లోనే.. గుంటూరులో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న స‌హా.. తాజాగా ప‌వ‌న్ -చంద్ర‌బాబుల భేటీపై వైసీపీ లైన్‌కు విరుద్ధంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌డం , వ్యాఖ్య‌లుచేయ‌డంపై పార్టీ అధిష్టానం చాలా సీరియ‌స్‌గా ఉంద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి గ‌త రెండు రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇంత‌లోనే ఆయ‌న మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చి.. ప‌వ‌న్‌-చంద్ర‌బాబుల భేటీకి సానుకూలంగా మాట్లాడ‌డంతో అధిష్టానం సీరియ‌స్ అయింద‌ని అంటున్నారు.

ఏం చూసి మిడిసిపాటు? ఒక్క‌సారి గ‌తాన్ని గుర్తు చేసుకో. ఇత‌ర ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు? అని కీల‌క స‌ల‌హాదారు తీవ్రంగా వ్యాఖ్యానించిన‌ట్టు ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. అటు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నడుస్తోంది. ఇదిలావుంటే.. వైసీపీని కాదంటే.. ఈయ‌న‌కు టికెట్ ఇచ్చే నాయ‌కులు కానీ, పార్టీకానీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 10, 2023 5:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

11 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

31 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

1 hour ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago