వైసీపీ అధిష్టానం.. ఒక ఎమ్మెల్యేపై చాలా సీరియస్ అయిందనే ప్రచారం తాడేపల్లి వర్గాల్లో సాగుతోంది. ఇటీవలే..ఈయనను స్వయంగా సీఎం జగన్ తన నివాసానికి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటి కీ.. ఆయనలో మార్పు రాకపోవడంతో తాజాగా కీలక సలహాదారు ఒకరు.. స్వయంగా ఫోన్ చేసి.. ఏం చూసి మిడిసిపాటు? అని ప్రశ్నించినట్టు తాడేపల్లి వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన సదరు ఎమ్మెల్యే గత ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ నుంచి వచ్చి.. వైసీపీ లో చేరారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపుగుర్రం ఎక్కారు. కొన్నాళ్లుగా సొంత పార్టీ మంత్రి తో విభేదిస్తున్న ఆయన.. తరచుగా.. వివాదాలకు కేంద్రంగా మారారు. ఈ క్రమంలోనే ఇటీవల సీఎం జగన్ స్వయంగా మాట్లాడి.. నోరు అదుపులో పెట్టుకోవాలని.. సూచించారని.. పార్టీ కోసం పనిచేయాలని సూచించినట్టు ప్రచారం జరిగింది.
అయితే.. ఇంతలోనే.. గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటన సహా.. తాజాగా పవన్ -చంద్రబాబుల భేటీపై వైసీపీ లైన్కు విరుద్ధంగా ఆయన వ్యవహరించడం , వ్యాఖ్యలుచేయడంపై పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇంతలోనే ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చి.. పవన్-చంద్రబాబుల భేటీకి సానుకూలంగా మాట్లాడడంతో అధిష్టానం సీరియస్ అయిందని అంటున్నారు.
ఏం చూసి మిడిసిపాటు? ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. ఇతర ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు? అని కీలక సలహాదారు తీవ్రంగా వ్యాఖ్యానించినట్టు ఇటు నియోజకవర్గంలోనూ.. అటు తాడేపల్లి వర్గాల్లోనూ చర్చనడుస్తోంది. ఇదిలావుంటే.. వైసీపీని కాదంటే.. ఈయనకు టికెట్ ఇచ్చే నాయకులు కానీ, పార్టీకానీ లేకపోవడం గమనార్హం.
This post was last modified on January 10, 2023 5:27 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…