Political News

బాబు ‘ఏజ్‌’ పై సీఎం జ‌గ‌న్‌ కామెంట్లు

టీడీపీ అధినేత Chandrababu వ‌య‌సుపై వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ’73 ఏళ్ల ముస‌లాయ‌న‌’ అంటూ.. కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించారు. జోగునాథునిపాలెం వద్ద 9 వంద‌ల 86 కోట్ల రూపాయ‌ల విలువైన‌ ప్రాజెక్టులకు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం జోగినాథునిపాలెంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. మీ ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాన‌న్నారు.

దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన‌ట్టు తెలిపారు. గత పాలకుల వల్ల నర్సీపట్నంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, గతంలో ఈ ప్రాంతాన్ని పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని విమ‌ర్శించారు. మన ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. వెనకబడిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టిన‌ట్టు చెప్పారు.

విద్యాపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామ‌న్నారు. 5 వంద‌ల కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో మెడికల్‌ కాలేజీ నిర్మాణం చేప‌ట్ట‌నున్నట్టు తెలిపారు. ఈ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ వస్తుంది అని CM Jagan చెప్పారు. ఈ క్ర‌మంలోనే మాజీ సీఎం చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. “73 ఏళ్ల ముస‌లాయ‌న‌.. అధికారం కోసం పాకులాడుతున్నార‌”ని అన్నారు.

అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు 73 ఏళ్ల ముస‌లాయ‌న పాకులాడుతుంటే.. ఈయ‌న ద‌త్త‌పుత్రుడు, ద‌త్త తండ్రిని అధికారంలోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని.. ప‌రోక్షంగా ప‌వ‌న్‌పైనా కామెంట్లు చేశారు. ప‌వ‌న్‌కు నిర్మాత‌, ద‌ర్శ‌కుడు కూడా చంద్ర‌బాబేన‌ని జ‌గ‌న్ దుయ్య‌బ‌ట్టారు. “ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం” అని జ‌గ‌న్ అన్నారు.

ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని తిరిగేలా పాలన చేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతోందని, ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంద‌ని అన్నారు. “మంచి చేస్తున్నా.. వారికి చెడే కనిపిస్తుంది. అవ్వతాతలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు పెన్షన్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. దీనిపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు” అని సీఎం జగన్‌ మండిపడ్డారు.

This post was last modified on December 30, 2022 2:27 pm

Share

Recent Posts

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

1 minute ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

1 hour ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

1 hour ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

3 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

3 hours ago