Movie News

సంక్రాంతికి దిల్ రాజు నుంచి మరో సినిమా?

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజును.. ఈ సంక్రాంతికి సరికొత్తగా చూడబోతున్నాం. ఎప్పుడూ ఈ పండక్కి రిలీజయ్యే పెద్ద తెలుగు సినిమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో్ని ప్రధాన ఏరియాల్లో తనే రిలీజ్ చేస్తూ ఉంటాడు రాజు. సంక్రాంతి తెలుగు సినిమాల్లో హీరోలు ఎవరైనా, వాటిని నిర్మించిన సంస్థలు ఏవైనా.. నైజాం, వైజాగ్ లాంటి ఏరియాల్లో రాజు బేనర్ నుంచే రిలీజ్ కావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సొంతంగా నిర్మించి తెలుగు చిత్రాలను కూడా సంక్రాంతి రేసులో నిలుపుతుంటాడు రాజు.

ఐతే 2023 సంక్రాంతికి మాత్రం భిన్నమైన దృశ్యం చూడబోతున్నాం. ఈ పండక్కి షెడ్యూల్ అయిన చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లతో రాజుకు ఎలాంటి సంబంధం ఉండబోదు. ఏ ఏరియాలకు కూడా వాటి హక్కులు తీసుకోలేదు రాజు. నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టి ఈ చిత్రాలను రిలీజ్ చేసుకుంటున్నారు.

రాజు తన నిర్మాణంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వారిసు’ను తెలుగులో కొంచెం పెద్ద స్థాయిలో రిలీజ్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు అంతగా డిమాండ్ లేకపోయినా ఎక్కువ థియేటర్లు ఇచ్చుకుంటుండడంపై రాజు విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా ఆయన ఈ పండక్కి మరో డబ్బింగ్ సినిమాను కూడా తన బేనర్ మీద రిలీజ్ చేయబోతున్నాడట. అదే.. తెగింపు.

అజిత్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘తునివు’కు ఇది తెలుగు వెర్షన్. ఈ చిత్ర హక్కులను ముందు వేరే సంస్థేదో దక్కించుకుందని వార్తలొచ్చాయి. కానీ చేతులు మారి రాజు బేనర్ ద్వారా ‘తెగింపు’ రిలీజ్ కానుందట. ఈ చిత్రం సంక్రాంతి రేసులో అన్నింటికంటే ముందు 11న రిలీజ్ కానుంది. మరుసటి రోజు వీరసింహారెడ్డి, వారసుడు.. 13న వాల్తేరు వీరయ్య వస్తాయి. 11న ‘తెగింపు’కు అసలు పోటీయే లేదు. ఆ ఒక్క రోజు ఆ చిత్రానికి కావాల్సినన్ని స్క్రీన్లు, షోలు దక్కుతాయి. ఈ చిత్ర హక్కులు రూ.3 కోట్లకే ఇచ్చేశారట. మంచి పబ్లిసిటీ చేసి ప్లానింగ్‌తో రిలీజ్ చేస్తే ఆ ఒక్క రోజులోనే సినిమా లాభాల బాట పట్టొచ్చు. అందుకే రాజు సినిమా చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on December 30, 2022 5:09 pm

Share
Show comments

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

46 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago