ప్రస్తుతం ఇండియాలో అత్యధిక పారితోషకం అందుకునే కథానాయకుల్లో ఒకడు Prabhas. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, బడ్జెట్లు, రెమ్యూనరేషన్.. ఇలా అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటే అతనే ఇండియాలో నంబర్ వన్ హీరో అని కూడా చెప్పొచ్చు. అతను ఒక్కో సినిమాకు వంద కోట్లకు తక్కువ పారితోషకం తీసుకోవట్లేదన్నది అంచనా. అలాంటి హీరో పదేళ్ల ముందు అప్పుల్లో ఉన్నాడట.
ఇది ‘బాహుబలి’ చేయడానికి ముందు కథ. అప్పటికే ప్రభాస్ పెద్ద స్టార్. కెరీర్లో కొన్ని మంచి హిట్లున్నాయి. అతడి తండ్రి సూర్యానారాయణరాజు పేరున్న నిర్మాత. పెదనాన్న కృష్ణంరాజు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హీరో. వారికి ఆస్తులు, ఆదాయానికి కొదవలేదు. అయినా తాను ఒక టైంలో అప్పుల్లో ఉన్నట్లు ప్రభాస్ చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘బాహుబలి’ చేయడానికి ముందు సంగతుల గురించి చెబుతూ ప్రభాస్.. మధ్యలో ఈ విషయం చెప్పాడు.
‘బాహుబలి’ ప్లానింగ్ జరుగుతున్న టైంలోనే తాను ‘రెబల్’ సినిమా చేసినట్లు ప్రభాస్ తెలిపాడు. ఈ సినిమా కోసం రాజమౌళిని పర్మిషన్ అడుగుతూ.. కొంచెం అప్పులున్నాయి తీర్చుకోవాలి అని చెప్పినట్లు ప్రభాస్ వెల్లడించాడు. ఆ సినిమా అయ్యాక మళ్లీ ‘మిర్చి’ కోసం రాజమౌళి దగ్గర అనుమతి అడిగినట్లు కూడా ప్రభాస్ తెలిపాడు. అప్పుడు రాజమౌళి భార్య రమ.. ‘‘మనవాడు ఎలాగూ లేటే కదా. ఆ సినిమా కూడా చేసెయ్’’ అని తనతో అన్నట్లు ప్రభాస్ చెప్పాడు.
తన స్నేహితులైన వంశీ-ప్రమోద్ అప్పటికే నిర్మాతలు కావాలని చూస్తున్నారని.. తనకు కూడా సొంత బేనర్ అంటూ ఒకటుంటే బాగుంటుందని అనిపించి.. యువి బేనర్లో ‘మిర్చి’ చేశానని.. అదృష్టవశాత్తూ ఆ సినిమా పెద్ద హిట్టయిందని ప్రభాస్ తెలిపాడు. ‘వర్షం’ సినిమా సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య రిలీజైందని.. ఇంత రిస్క్ వద్దని తాను చెప్పినా.. నిర్మాత ఎం.ఎస్.రాజు మాత్రం వినకుండా అప్పుడే దాన్ని రిలీజ్ చేశారని.. అది కూడా బాగా ఆడి తన కెరీర్లో తొలి పెద్ద హిట్గా నిలిచిందని ప్రభాస్ తెలిపాడు.
This post was last modified on December 30, 2022 2:14 pm
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…