Political News

రఘురాముడి సీటు మార్పించిన వైకాపా

గత వారం రోజులుగా వ్యవహారం కొంచెం చల్లబడింది కానీ.. అంతకుముందు ఏపీ రాజకీయాల్లో రఘురామ కృష్ణంరాజు హాట్ టాపిక్. కొన్ని వారాలుగా ఆయనకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య నడుస్తున్న రగడ గురించి తెలిసిందే. కొంత కాలంగా పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్న ఆయన.. ఇటీవల స్వరం పెంచారు.

అధినాయకత్వంతో పాటు పార్టీలో అనేకమంది నాయకుల్ని ఏకి పడేస్తే మీడియాలో హల్‌చల్ చేశారు. పార్టీ షోకాజ్ నోటీసు ఇస్తే దానికి కూడా తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చి అధినాయకత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కల్పించారు. రఘురామ కృష్ణంరాజును కట్టడి చేయకపోతే పార్టీలో క్రమశిక్షణ దెబ్బ తింటుందంటూ అంతర్గతంగా పెద్ద ఎత్తున గళాలు వినిపించాయి.

కానీ ఇప్పటిదాకా రఘురాముడిని ఏమీ చేయలేకపోయింది వైకాపా. ఐతే ఇప్పుడు ఆయనకు చిన్న స్థాయిలో ఒక షాక్ ఇచ్చింది. లోక్‌సభలో ఆయన స్థానాన్ని మార్చింది వైకాపా. రఘురామ కృష్ణంరాజుకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పార్టీ నాయకులు కూర్చునే వరుసల్లో ఇంతకముందు ఆయనకు ముందు వరుసలో సీటు ఉండేది. దాన్ని వెనక్కి మార్చింది వైకాపా.

లోక్‌సభలో నాలుగో వరుస నుంచి వైకాపా ఎంపీల సీట్లుండగా.. ఇకపై అక్కడి నుంచి రఘురాముడు ఏడో వరుసలో కూర్చోవాల్సి ఉంటుంది. ఆ వరుసలో ఉన్న మార్గాని భరత్‌ను ముందుకు తీసుకొచ్చి.. అతడి స్థానంలో రఘురామ కృష్ణంరాజును కూర్చోబెట్టనున్నారు. ఇంతకముందు ఆయన సాటు నంబర్ 379 కాగా.. ఇకపై 445కి మారనుంది. ఈ పరిణామంపై రఘురామ కృష్ణంరాజు ఎలా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on July 18, 2020 4:29 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు?

హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…

1 hour ago

చిన్న దర్శకుడి మీద పెద్ద బాధ్యత

మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…

1 hour ago

తీన్మార్ మ‌ల్ల‌న్న ఆస్తులు ప్ర‌భుత్వానికి.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. నిత్యం మీడియాలో ఉంటూ..త‌న‌దైన శైలిలో గ‌త కేసీఆర్ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింత‌పండు న‌వీన్ గురించి…

2 hours ago

ఆవేశం తెలుగు ఆశలు ఆవిరయ్యాయా

ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…

3 hours ago

అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !

తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…

3 hours ago

తమన్నా రాశిఖన్నా ‘బాక్’ రిపోర్ట్

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్‌మనై 4 మీద కాస్తో కూస్తో…

3 hours ago