Political News

‘అంబటి కాపుల గుండెల్లో కుంపటి’

ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చేయడమే జనసేన ముందున్న లక్ష్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ.. రైతులు సంతోషంగా లేరని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదన్నారు. అన్నదాతల కష్టాలను పట్టించుకునే అధికారులు కరవయ్యారన్న ఆయన.. ప్రజలను బెదిరించటానికి, ప్రతిపక్షాల సభలను అడ్డుకోవటానికే వస్తారని మండిపడ్డారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పాల్గొన్న పవన్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలు దగ్గరికి వస్తున్నందునే అవినీతికి సీఎం జ‌గ‌న్‌ హాలీడే ప్రకటించార‌ని ఆరోపించారు. తనను వారాంతపు రాజకీయ నేత అంటూ కాపు నాయకులతో పచ్చి బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. వారానికి ఒక్కరోజు వస్తేనే… వైసీపీ నేత‌లు, మంత్రులు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

తనకు తాతలు సంపాదించి పెట్టిన వేల కోట్లు లేవనీ.. అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు తన వద్ద లేదని ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్‌పై విమ్శ‌లు గుప్పించారు. సినిమాల్లో న‌టించి సంపాయించిన కష్టార్జితంతోనే కౌలు రైతులకు సాయం చేస్తున్నానని పవన్‌ తెలిపారు. ఇదే సమయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అని విమర్శించారు. పోలవరం పూర్తి చేయటం తెలియని ఆయన.. నీటిపారుదల మంత్రి అని ధ్వజమెత్తారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడం లేదన్న పవన్‌.. తాను ఎట్టి ప‌రిస్థితిలోనూ వైసీపీని గెలవనివ్వ‌బోన‌ని పేర్కొన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోననే మాటకు కట్టుబడి ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదన్నారు. వైసీపీ నేతల్లా పింఛన్లు, బీమా సొమ్ము నుంచి కమీష‌న్లు కొట్టే రకం కాదని, అక్రమాలు చేసే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానని తెలిపారు.

This post was last modified on December 19, 2022 8:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

15 minutes ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

1 hour ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

2 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

4 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

6 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

6 hours ago