ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అభిమానుల నుంచే కాదు.. వృద్ధులు, మహిళల నుంచి కూడా అపూర్వమైన స్వాగతం లభించింది.
పవన్ ను చూసేందుకు మాత్రమే కాదు.. ఆయన చెప్పేది వినేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు పోటెత్తారు. ఒక వృద్ధురాలు..ఏకంగా బారికేడ్ను దాటుకుని.. జనసేనానిని చూసేందుకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
ఈల వేసి.. గోల చేస్తూ..పవన్కు జేజేలు పలుకుతున్న వైనం అందరినీ ఆకట్టుకుంది. ఇక, జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అయితే దీనికి ముందుగా దారిలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పవన్కు ఘన స్వాగతం పలికారు.
మేడి కొండూరు మండలం పేరేచర్ల జంక్షన్లో, కొర్రపాడులో దారిపొడవునా జన సైనికులు స్వాగతం పలికారు. అక్కడ పవన్ను గజమాలతో సత్కరించారు. పవన్ కల్యాణ్ను చూసేందుకు మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలిరాగా అభిమానులకు నమస్కారం చేస్తూ పవన్ ముందుకు సాగారు.
సభకు కూడా ఊహించని విధంగా అభిమానులు పోటెత్తారు. జిల్లా నుంచే కాకుండా.. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. పవన్ హాట్ కామెంట్లుచేసిన ప్రతిసారీ.. చప్పట్లు ఈలలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది.
This post was last modified on December 18, 2022 8:47 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…