తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్.. ఇక, నుంచి బీఆర్ఎస్గా అవతరించనుంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనుంది. ఈ మేరకు టీఆర్ఎస్ అదినేత, సీఎం కేసీఆర్ భారత ఎన్నికల సంఘానికి పంపించిన ప్రతిపాదనకు ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊంపింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పేరు మార్పుపై ఈసీ నుంచి కేసీఆర్కు అధికారికంగా లేఖ అందింది.
ఈ ఏడాది అక్టోబరు 5న విజయదశమి(దసరా) సందర్భంగా అదే రోజున కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ను జాతీయ పార్టీ బీఆర్ఎస్గా మారుస్తూ తీర్మానం చేశారు. మరుసటి రోజు.. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో కొందరు ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించి.. తమ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలని అభ్యర్థించింది.
ఈనేపథ్యంలో దాదాపు 60 రోజుల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని తాజాగా ప్రకటించింది . ఇదిలావుంటే, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు నిర్వహించేందుకు పార్టీ అదినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.అ దేసమయంలో శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగానే బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఆ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొనాలని పార్టీ నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. బీఆర్ఎస్గా పేరుమార్పు ప్రక్రియ పూర్తికావడంపై తదుపరి కార్యాచరణపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.
This post was last modified on December 9, 2022 8:31 am
కొన్ని రాజకీయ చర్చలు ఆసక్తిగా ఉంటాయి. ఆయా పార్టీల నాయకులు కూడా.. సుదీర్ఘకాలం చర్చించుకునేలా ఉంటాయి. అలాంటి రాజకీయ చర్చల్లో…
ఏపీ సీఎం చంద్రబాబు జపిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుకదా! పేదలను ధనికులుగా చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.…
పూజా హెగ్డే.. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా ఉన్న భామ. తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజే…
అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…
కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి…
వైసీపీ అధినేత జగన్కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ…