Political News

తెలంగాణలో అమర్‌రాజా 9500 కోట్లు.. ఏపీ చూస్తోందా?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చాక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పరిశ్రమలు రావడం గగనంగా మారిన మాట వాస్తవం. అంతే కాదు ఉన్న పరిశ్రమలు సైతం రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయన్నదీ నిజం. ఈ విషయంలో మీడియా ఊరికే రాద్దాంతం చేస్తోందని, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అధికార పార్టీ స్టేట్మెంట్లు ఇచ్చేస్తే సరిపోదు. వాస్తవంగా ఏం జరుగుతోందో జనం చూస్తూనే ఉన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ‘కియా’ మాదిరి రాష్ట్రంలోకి ఒక్క పెద్ద పరిశ్రమ అయినా వచ్చిందా.. భారీగా పెట్టుబడులు పెట్టి వేల ఉద్యోగాలు ఇచ్చిందా అని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. చివరికి దేశంలోనే అతి పెద్ద పరిశ్రమల్లో ఒకటైన అమర్ రాజా తమ సొంత రాష్ట్రం నుంచి తరలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అతి కష్టం మీద ఉన్న పరిశ్రమను వెళ్లిపోకుండా ఆపగలిగారు కానీ.. కొత్త పెట్టుబడులు మాత్రం పెట్టించలేకపోయారు.

ఇప్పుడు అమర్ రాజా ఏకంగా 9500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో కొత్త ఫ్యాక్టరీకి సిద్ధం కావడం గమనార్హం. శుక్రవారం హైదరాబాద్‌లో ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది అమర్ రాజా సంస్థ. విద్యుత్ వాహనాలకు అవసరం అయ్యే బ్యాటరీల యూనిట్‌ను తెలంగాణలో అమర్‌రాజా ఏర్పాటు చేయబోతోంది. ఈ సందర్భంగా అమర్ రాజా అధినేత గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. తమ పరిశ్రమలు, పెట్టుబడులు అన్నీ ఏపీకే పరిమితం అవుతున్నాయని.. అందుకే తెలంగాణలో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం మీదా ఆయన ప్రశంసలు కురిపించారు. అంతే తప్ప ఎక్కడా ఏపీలో ఈ ప్లాంటు ఎందుకు పెట్టట్లేదని క్లియర్‌గా చెప్పలేదు. అందుకు కారణం జగన్ సర్కారు అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తమ పార్టీ ఎంపీనే అయిన జయదేవ్‌ను తెలంగాణకు వెళ్లనిచ్చేవారా.. ఇంత పెద్ద పరిశ్రమ పెట్టనిచ్చేవారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on December 3, 2022 8:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

2 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

46 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago