తిరుగులేని ఆడ్మినిస్ట్రేటర్ గా పేరుంది చంద్రబాబుకు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీఈవోగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని చేతల్లో చూపించిన చంద్రబాబు.. అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవించారనే చెప్పాలి. పాలనలో భాగంగా ప్రజల మనసుల్ని దోచే అంశం మీదనే ఫోకస్ పెట్టాలే తప్పించి.. మిగిలిన అంశాలు పెద్దగా పని చేయవన్న విషయం ఆయన చేతికి అధికారం చేజారిన తర్వాత కానీ అర్థం కాలేదు. పాలనలో చంద్రబాబు శైలిని మెచ్చుకునే వారంతా ఆయన ప్రసంగాలకు మాత్రం తెగ బోరింగ్ గా ఫీల్ అవుతారు.
అయితే.. ఆయన ప్రసంగాల్లో పదును తెచ్చిన ఘనత మొదట దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇవ్వాలి. ఎందుకంటే.. అప్పటివరకు చంద్రబాబుకు ప్రసంగాలతో అవసరం లేకుండా పోయింది. ఆయనేం చెబితే అదే అన్నట్లు ఉండేది. దీనికి తోడు అధికారం ఆయన చేతిలోనే ఉండటంతో ఆయనకు తిరుగు ఉండేది కాదు. అలాంటి చంద్రబాబుకు తన మాటలతో ప్రజల్ని ఆకర్షించేలా చేయాల్సిన అవసరాన్ని తీసుకొచ్చిన మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రడ్డి.
ప్రతిపక్ష నేతగా మొదటి ఐదేళ్లు చంద్రబాబు పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. చేతిలో పవర్ లేకపోవటం.. మరో వైపు ముఖ్యమంత్రిగా వైఎస్ లాంటి ఛరిష్మా ఉన్న అధినేతను అధిగమిస్తూ మాట్లాడటం కష్టంగా ఉండేది. అయితే.. తన ప్రసంగ తీరును మార్చుకునేందుకు తీవ్రంగా శ్రమించిన చంద్రబాబు.. ఐదేళ్లకు కాస్తంత మెరుగుపడిన పరిస్థితి. అయినా కూడా వైఎస్ చేసే సూటి ప్రసంగాల ముందు చంద్రబాబు తేలిపోయేవారు. అయితే.. అదే పనిగా ఎదురుదెబ్బల కారణంగా చంద్రబాబు మాటల్లో తేడా మొదలైంది.
అలా మొదలైన మార్పు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా చాలా మెరుగుపడింది. ఇవాల్టి రోజున చంద్రబాబు ప్రసంగం వింటే.. వింటున్నది చంద్రబాబు మాటలేనా? అనుకునే పరిస్థితి. అంతలా ఆయన మాటల్లో మార్పు వచ్చింది. మాటల కోసం కిందా మీదా పడి.. అందరి చేత జోకులు వేయించుకునే స్థితి నుంచి తన మాటలతో నిప్పులు కురిపించే స్థాయికి చంద్రబాబు చేరుకున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది.
చంద్రబాబు ప్రసంగంలో హైలెట్ అన్నట్లుగా ఉన్న కొన్ని వ్యాఖ్యల్ని చూస్తే..
This post was last modified on December 2, 2022 10:41 am
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…