Political News

జ‌న‌సేన‌లో ఒకేసారి ఇంత పెద్ద మార్పా!

ఇప్ప‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న జ‌న‌సేన పార్టీలో క‌ద‌లిక‌లు ప్రారంభ‌మ‌య్యాయా? నాయ‌కులు ముందుకు క‌దులుతున్నారా? ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారా? అంటే.. తాజాగా గ‌త నాలుగు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో జ‌న‌సేన నేత‌ల క‌ద‌లిక‌లు బాగానే ఉన్నా య‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి పార్టీ పెట్టి 8 సంవత్స‌రాలు పూర్త‌యినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆశించిన రీతిలో ప్ర‌జాఉద్య‌మం మాత్రం నిర్మించ‌లేక పోయారు. ప్ర‌జ‌ల్లొకి కూడా వెళ్ల‌లేక పోయారు. ఇది పార్టీకి మైన‌స్ అయింది.

కేవ‌లం ప‌వ‌న్ ఇమేజ్ మాత్ర‌మే పార్టీని ఇప్ప‌టి వ‌ర‌కు న‌డిపిస్తూ వ‌చ్చింది. ఇది ఎంత వ‌ర‌కు పార్టీని న‌డిపిస్తుంది? అనేది ప్ర‌శ్న‌గానే మారింది. ఈ నేప‌థ్యంలోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఇటీవ‌ల పార్టీ నాయ‌కుల‌కు బాగానే క్లాస్ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది. ప‌నిచేసేవారిని గుర్తు పెట్టుకుంటాన‌ని, ఆయ‌న స్ప‌ష్టం చేసిన‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. ప‌నిచేయ‌ని వారు మొహ‌మాటం లేకుండా పార్టీ నుంచి వెళ్లిపోవ‌చ్చ‌ని కూడా చెప్పార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం.. స‌హా అన్ని జిల్లాల్లోనూ జ‌న‌సేన నేత‌లు రోడ్డెక్కుతున్నారు.

తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాలో నానాజీ, లీలాకృష్ణ త‌దిత‌ర నేత‌లు రోడ్డెక్కారు. విజ‌య‌వాడ‌లో పోతిన వెంక‌ట మ‌హేష్‌, సోడిశెట్టి రాధా వంటివారు కూడా రోడ్డెక్కుతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై బాగానేరియాక్ట్ అవుతున్నారు. నానాజీ , లీలా కృష్ణ అయితే.. ప్ర‌స్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై తీవ్ర ఆరోప‌ణ‌లే చేశారు. ఆయ‌న భూమిని ఆక్ర‌మించుకున్నార‌ని.. విమ‌ర్శించ‌డంతోపాటు క‌లెక్ట‌ర్ కు కూడా ఫిర్యాదులు చేశారు. మ‌రోవైపు.. అనంత‌పురంలో నూ జ‌న‌సేన నాయ‌కులు రోడ్ల‌పై కూర్చుని నిర‌స‌న తెలిపారు. ర‌హ‌దారులు వేయాలంటూ.. నిన‌దించారు.

ఇక‌, జ‌గ‌న‌న్న ఇళ్ల కాల‌నీల్లోనూ జ‌న‌సేన నాయ‌కులు విస్తృతంగా ప‌ర్య‌టించారు. అక్క‌డి లోపాల‌ను ఎత్తి చూపారు. ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ల‌బ్ధీ ఒన‌గూర‌లేద‌ని.. ప్ర‌భుత్వం అన్యాయం చేస్తోంద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతోపాటు.. జ‌గ‌న‌న్న ఇళ్ల‌కు సంబంధించి.. లోటుపాట్ల‌ను కూడా ఎత్తి చూపించారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌తో జ‌న‌సేన‌లో అయితే.. క‌ద‌లిక‌లు క‌నిపిస్తున్నాయని.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఇదే ప‌రిస్థితి ఉంటే ఇక తిరుగులేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 17, 2022 6:28 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

2 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

2 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

3 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

3 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

3 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

4 hours ago