Political News

తెల్లవారుజామున అయ్యన్న.. ఆయన కుమారుడు అరెస్టు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రాజకీయ అరెస్టు చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుని ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి.. ఆయనకు నోటీసులు అందజేశారు. అనంతరం ఆయన్ను.. ఆయన కుమారుడు రాజేశ్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఇంతకూ ఇంతటి హైడ్రామా ఎందుకు? అయ్యన్నపాత్రుడిని ఎందుకు అరెస్టు చేశారు? ఆయన మీద ఉన్న అభియోగం ఏమిటి? ఆయనపైనా.. ఆయన కొడుకు పైనా సీఐడీ అధికారులు నమోదు చేసిన నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంతకూ ఆయన చేసిన అరవీర భయంకర నేరం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే విస్మయానికి గురి కాక మానదు.

అధికారులు వెల్లడిస్తున్న సమచారాన్ని చూస్తే.. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రెండు సెంట్ల స్థలాన్ని (96 గజాలు)అక్రమంగా ఆక్రమించిన అయ్యన్న పాత్రుడు ఆక్రమించినట్లుగా ఆరోపిస్తున్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలుపై రెండు సెంట్ల మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మించారు.

దీన్ని ఈ మధ్యన అధికారులు గుర్తించి కూల్చేశారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించిన సమయంలో అధికారులకు అయ్యన్న.. ఆయన కుటుంబ సభ్యులు తప్పుడు పత్రాలు సమర్పించారు. దీంతో.. ఈ పత్రాలపై ఇరిగేషన్ అధికారులు సీఐడీకి కంప్లైంట్ చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు అయ్యన్న.. ఆయన కుమారుడు సమర్పించిన పత్రాలు ఫోర్జరీ చేసినట్లుగా నిర్దారించారు. ఇందులో భాగంగా ఈ తెల్లవారుజామున ఆయన్ను అరెస్టు చేశారు. వారిద్దరిని ఏలూరు కోర్టుకు తరలిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

నిజంగానే అయ్యన్న పాత్రుడు ఆయన కుటుంబ సభ్యులు రెండు సెంట్ల స్థలంలో అక్రమంగా ఆక్రమించుకున్నారే అనుకుందాం.. అలాంటి నేరానికి ఇంత హైడ్రామాతో.. తెల్లవారుజామున భారీగా ఇంటి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి.. అరెస్టు చేయాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కొందరు తమదైన రీతిలో సమాధానాన్ని ఇస్తున్నారు.

This post was last modified on November 3, 2022 2:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago