దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఉదంతంలో.. ఎన్ కౌంటర్ లో అతగాడు బలి కావటం తెలిసిందే. అందరి అంచనాలకు ఏమాత్రం తేడా లేకుండా సాగిన ఎన్ కౌంటర్ పై ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గ్యాంగ్ స్టర్ సతీమణి రిచా దూబే సైతం ఆ తరహాలోనే వ్యాఖ్యలు చేయటం విశేషం. పోలీసులపై మరణకాండకు పాల్పడ్డ వికాస్ ఇలాంటి చావుకు అర్హుడే అని ఆమె వ్యాఖ్యానించారు.
ఎన్ కౌంటర్ లో మరణించిన వికాస్ దూబే అంత్యక్రియలు కాన్పూరులోని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిచాతోపాటు.. ఆమె కుమారుడు.. తమ్ముడు తదితరులు హాజరయ్యారు. దుబే డెడ్ బాడీని ఎలక్ట్రిక్ క్రిమేషన్ మెషీన్ లో ఉంచి అంత్యక్రియల్ని నిర్వహించారు.
ఎన్ కౌంటర్ మీద స్పందించాలన్న రిపోర్టర్ల ప్రశ్నలకు స్పందించిన ఆమె.. వికాస్ చాలా పెద్ద తప్పు చేశాడని.. అతనికి ఇలాంటి చావు రాసి పెట్టి ఉందన్నారు.
అదే సమయంలో.. తనను ప్రశ్నలు వేస్తున్న మీడియా ప్రతినిధులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీవల్లే వికాస్ కు ఈ గతి పట్టింది.. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలన్నారు. రిపోర్టర్లపై రుసరుస లాడిన రిచా దూబే.. అందుకు భిన్నంగా ఎన్ కౌంటర్ మీద మాత్రం ఒక్క నెగిటివ్ వ్యాఖ్య కూడా చేయకపోవటం గమనార్హం.
గ్యాంగస్టర్ వికాస్ దూబేను గత వారంలో అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయటం.. ఆక్రమంలో డీఎస్పీ స్థాయి అధికారి మొదలు మొత్తం 8 మంది పోలీసుల్ని కాల్చి చంపాడు.
అనంతరం పారిపోయిన అతడ్ని.. అతడి అనుచర వర్గాన్ని పట్టుకునే క్రమంలో పోలీసులు ఎన్ కౌంటర్ లో లేపేయటం తెలిసిందే. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లో వికాస్ దూబేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అక్కడి నుంచి కాన్పూరుకు అతన్ని తరలిస్తున్న వేళ.. వారు ప్రయాణిస్తున్నవాహనం బోల్తా పడింది. దీంతో.. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గ్యాంగ్ స్టర్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చారు.
This post was last modified on July 11, 2020 11:54 am
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…