Political News

పీకే మొదటి అడుగు వేశారా ?

రాజకీయ వ్యూహకర్తగా పాపులరైన ప్రశాంత్ కిషోర్ (పీకే) పాదయాత్ర మొదలుపెడుతున్నారు. ఈరోజు అంటే అదివారం నాడు బీహార్లో తన యాత్రను మొదలు పెట్టబోతున్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పశ్చిమ చంపారన్ జిల్లాలో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. 1917లో గాంధి మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భితిహర్వాలోనే పీకే కూడా ఉద్యమం మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు.

3500 కిలోమీటర్ల పాదయాత్ర సుమారుగా 18 నెలలుగా జరగబోతోంది. చాలాకాలంగా వ్యూహకర్తగా తెరవెనుకకు మాత్రమే పరిమితమైన పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చాలా ఉబలాటపడుతున్నారు. ఎన్నో పార్టీలను వ్యూహాలతో గెలిపించిన తానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు దిగకూడదని బహుశా పీకే ఆలోచించారేమో. తన వ్యూహాల ద్వారా ఎవరినో గెలిపించే బదులు అదేదో తానే పార్టీపెట్టి గెలిచేస్తే ముఖ్యమంత్రి అయిపోవచ్చని అనుకున్నట్లున్నారు.

అందుకనే ‘జన్ సురాజ్’ పేరుతో పాదయాత్రకు బీహార్ జనాలందరినీ ఉద్యమం వైపుగా కదిలించాలని డిసైడ్ అయిపోయారు. తొందరలో పీకే పెట్టబోయే పార్టీకి ఇది మొదటి అడుగుగా అనుమానంగా ఉంది. మరి ఒకవైపు పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళుతునే మరోవైపు వ్యూహకర్తగా కొన్ని పార్టీలకు ఎలా పనిచేయగలుగుతారనేది ప్రశ్న. ఇందులో భాగంగానే తన కంపెనీ ఐప్యాక్ నిర్వహణ మొత్తాన్ని ఇతరుల చేతికి అప్పగించారని అవసరమైనపుడు పై ఎత్తున పర్యవేక్షిస్తారంతే అని సమాచారం.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే అనేక పార్టీలతో సన్నిహితంగా తిరుగుతున్న కారణంగా పీకేకి కూడా బాగా రాజకీయ వాసనలు పట్టినట్లున్నాయి. అందుకనే రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీపెట్టి గెలిచేసి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకుంటున్నట్లున్నారు. ఏదైనా దిగితే కానీ లోతు తెలీదనే సామెత లాగ తయారవబోతోంది పీకే వ్యవహారం. రాజకీయ నేత వేరు వ్యూహకర్త వేరన్న విషయం తొందరలోనే పీకేకి అనుభవంలోకి రాబోతోంది. వ్యూహకర్తకు ప్రత్యక్షంగా జనాలకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ రాజకీయ నేతలు 24 గంటలూ జనాల్లోనే ఉంటారు. మరి పీకే తాజా ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.

This post was last modified on October 2, 2022 10:34 am

Share
Show comments
Published by
satya

Recent Posts

తీన్మార్ మ‌ల్ల‌న్న ఆస్తులు ప్ర‌భుత్వానికి.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. నిత్యం మీడియాలో ఉంటూ..త‌న‌దైన శైలిలో గ‌త కేసీఆర్ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింత‌పండు న‌వీన్ గురించి…

2 mins ago

ఆవేశం తెలుగు ఆశలు ఆవిరయ్యాయా

ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…

7 mins ago

అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !

తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…

23 mins ago

తమన్నా రాశిఖన్నా ‘బాక్’ రిపోర్ట్

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్‌మనై 4 మీద కాస్తో కూస్తో…

44 mins ago

వరలక్ష్మి ‘శబరి’ ఎలా ఉంది

తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…

1 hour ago

గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !

ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…

1 hour ago