మునుగోడు ఉపఎన్నికలో గెలుపు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టగా మారింది. టీఆర్ఎస్ సంగతి పక్కన పెట్టేస్తే కాంగ్రెస్, బీజేపీలకు మరీ ప్రతిష్టగా మారింది. కారణం ఏమిటంటే ఇక్కడ ఎంఎల్ఏగా ఉండి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ నేతే కాబట్టి. సో తన సీటును మళ్ళీ గెలిపించుకోవటం కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రేవంత్ రెడ్డికి బాగా ప్రతిష్టగా మారింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంఎఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరి మళ్ళీ పోటీచేస్తున్నారు కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి కూడా గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకమైంది. సరే రాజగోపాల్ వ్యవహారం పక్కనపెట్టేస్తే రేవంత్ కు మాత్రం ఉపఎన్నిక గెలుపు వ్యక్తిగతంగా కూడా ప్రతిష్టనే చెప్పాలి. ఎందుకంటే రేవంత్ భవిష్యత్తు ఉపఎన్నిక గెలుపుతోనే ముడిపడున్నది. అందుకనే నియోజకవర్గంలోని అన్నీ మండలాలకు కీలకమైన, తనకు బాగా నమ్మకం ఉన్న నేతలనే రేవంత్ ఇన్చార్జీలుగా నియమించారు.
తమకు బాధ్యతలు అప్పగించిన మండలాల్లో పార్టీకి మెజారిటి సాధించిన వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఖాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరీ హామీ గెలుపుకోసమే ఇచ్చారా ? లేకపోతే నిజంగానే టికెట్లిప్పించే ఉద్దేశ్యంతో చేశారా అన్నదే తెలీటంలేదు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడు అయినంత మాత్రాన ఎవరికీ టికెట్ ఇప్పిస్తాననే హామీ చెల్లదు. ఒక్కోసారి పీసీసీ అధ్యక్షుడు సిఫారసులను కూడా అధిష్టానం పట్టించుకోదు.
మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్ధిగా రేవంత్ సిఫారసు చేసిన నల్లమిల్లి కృష్ణారెడ్డిని కాదని అధిష్టానం పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చింది. ఇక్కడే రేవంత్ రికమెండేషన్ చెల్లలేదు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఏమి చెల్లుతుంది ? ఏవో కొన్ని సీట్లలో రేవంత్ చెప్పినవారికి అధిష్టానం టికెట్లు ఇవ్వవచ్చంతే. మొత్తం 119 నియోజకవర్గాల్లోను తాను చెప్పినవారికే టికెట్లివ్వాలని రేవంత్ పట్టుబడితే జరిగేదికాదు. ఏదో ఇపుడు గండం గడిచేందుకు రేవంత్ హామీలిస్తే ఇచ్చుండచ్చు. అసలు వాస్తవం ఏమిటో నేతలకు తెలీకుండానే ఉంటుందా ?
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…