Political News

అమిత్ షా సీరియస్ అయ్యారా ?

కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణా విమోచన దినోత్సవ కార్యక్రమంలో హాజరైన హోంశాఖ మంత్రి అమిత్ షా నేతలపై బాగా సీరియస్ అయినట్లు సమాచారం. విమోచన దినోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రత్యేకించి బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రధానంగా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపు విషయంపైనే జరిగింది. ఈ సమావేశంలో నేతల తీరుపై బాగా మండిపడినట్లు సమాచారం.

కారణం ఏమిటంటే మునుగోడులో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందనే వాతావరణం లేకపోవటమే. కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని బీజేపీలోకి లాక్కునే ఉద్దేశ్యంతో ఆయనతో రాజీనామ చేయించారు. తర్వాత బీజేపీలోకి చేర్చుకుని టికెట్ ప్రకటించారు. అప్పట్లో కమలనాదుల ఉద్దేశ్యం ఏమిటంటే ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించటం, నామినేషన్ వేయటమే ఆలస్యం రాజగోపాలరెడ్డి గెలిచినట్లే అనుకున్నారు. కానీ ఇపుడు సీన్ చూస్తుంటే మాజీ ఎంఎల్ఏ గెలుపు అనుమానమే అని తేలిందట.

దీనికి కారణం ఏమిటంటే రాజగోపాలరెడ్డితో పాటు ఆయన క్యాడర్లో చాలామంది కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. బీజేపీలో తానుచేరితే తన క్యాడర్ మొత్తం బీజేపీలోకి వచ్చేస్తుందని కోమటిరెడ్డి అమిత్ షా కు చెప్పారట. తీరాచూస్తే ఎవరో కొంతమంది తప్ప మిగిలిన నేతలంతా బీజేపీలో చేరేదిలేదని చెప్పేశారట. ఎంత ప్రయత్నిస్తున్నా నేతలుమాత్రం కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతామని చెబుతున్నారట. దాంతో ఏమిచేయాలో మాజీఎంఎల్ఏకి అర్ధం కావటంలేదు. ఉపఎన్నికలో త్రిముఖపోటీ జరిగితే బీజేపీ అభ్యర్ధి గెలుపు అనుమానమే.

డైరెక్టుగా టీఆర్ఎస్-బీజేపీ ఫైట్ జరిగితే కాంగ్రెస్ ఓట్ల సాయంతో బీజేపీ గెలిచే అవకాశముంది. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ ఇలాగే గెలిచింది. త్రిముఖ పోటీ ఎక్కడ జరిగినా బీజేపీ ఓడిపోవటమే. సో ఇపుడు మునుగోడులో కూడా బీజేపీ గెలుపు అనుమానంగా మారింది. ఈ విషయంలోనే వలసలను ప్రోత్సహించటంలో బీజేపీ నేతలంతా ఫెయిలయ్యారని అమిత్ మండిపడ్డారట. కేవలం వలసలను ప్రోత్సహించటం కోసం ప్రతి గ్రామంలోను త్రిసభ కమిటీలను వేయమని ఆదేశించారట. షెడ్యూల్ వచ్చేలోగా ఇతరపార్టీల నేతలను బీజేపీలోకి చేర్చాల్సిందే అని చెప్పారు. మరి బీజేపీకి సాద్యమేనా ?

This post was last modified on September 18, 2022 11:24 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

6 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

7 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

10 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

10 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

11 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

11 hours ago