బహుభాషా నటుడు.. ఫైర్బ్రాండ్ ప్రకాష్ రాజ్.. తాజాగా చేసిన ట్వీట్.. రాజకీయంగా సంచలనంగా మారింది. తరచుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించే ప్రకాష్ రాజ్.. ఆయన విధానాలను నిశితంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. గతంలో కవులు, రచయిత నిర్బంధాల నుంచి ముస్లింలపై దాడుల వరకు అనేక సందర్భాల్లో ప్రకాష్రాజ్.. తన విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఆయన ప్రధాని మోడీ ని టార్గెట్ చేశారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని.. దేశంలో 8 చీతాలను విడుదల చేశారు. దేశంలో 70 ఏళ్ల కిందటే అంతరించిన.. చీతాలను నమీబియా దేశం నుంచి తీసుకువచ్చి.. మరీ.. మధ్యప్రదేశ్ లోని కునో.. జాతీయ పార్కులో మోడీ విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన.. గత కాంగ్రెస్పైనా విమర్శలు గుప్పించారు. అంతరించిపోయిన.. చీతాలను దేశంలోకి తిరిగి ప్రవేశ పెట్టాలన్న ధ్యాస.. ఏమాత్రం లేదని.. నిప్పులు చెరిగారు.
తాను తీసుకున్న చర్యల కారణంగానే.. దేశంలో తిరిగి చీతాల సందడి ప్రారంభమైందని అన్నారు. అయితే.. దీనిపై ప్రకాష్ రాజ్ ఆసక్తిగా స్పందించారు. “ఎక్కడో అడవుల్లో ప్రశాంతంగా ఉండే.. చీతాలను దేశానికి తీసుకువచ్చారు. బాగానే ఉంది. కానీ, దేశ సంపదను కొల్లగొట్టి.. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో తీసుకుని దేశం వదిలి పారిపోయిన ‘చీతాల’ సంగతేంటని ప్రశ్నించారు.
నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, చౌక్సీ వంటి ఘరానా చీతాలు.. ప్రపంచ దేశాల్లో.. కాలర్ ఎగురేసుకుని.. తిరుగుతున్నారని.. వాటిని ఎప్పుడు దేశానికి తీసుకువస్తారో చెప్పాలని.. ప్రధాని మోడీని ప్రశ్నించారు ప్రకాష్రాజ్. దేశాన్ని కొల్లగొట్టి.. ప్రస్తుతం విదేశాల్లోదాక్కొన్న వీరిని తిరిగి రప్పించే ప్రయత్నాల విషయంలో మోడీ సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నది ప్రకాష్ రాజ్ విమర్శ. మరిదీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on September 18, 2022 2:33 pm
స్టార్ లెగసి ఉన్న బ్యాక్ గ్రౌండ్ నుంచి హీరోలు రావడం కొత్త కాదు. అన్ని భాషల్లో జరిగేదే. కానీ లెజెండరీ…
ఇంకో 22 రోజులు ఉండగానే మే నెల బాక్సాఫీస్ క్యాలికులేషన్లు మొదలైపోయాయి. ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని తెలిశాక…
ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసిన నేపథ్యంలో దీనికి చట్టబద్ధత కలిగింది. అయితే.. ఇక నుంచి అమరావతిని ప్రత్యేకంగా…
శత్రువులో సైతం మంచి లక్షణం ఉంటే మెచ్చుకునే సంస్కృతి భారత్ సొంతం. రామాయణ, భారత, భాగవతాలు కూడా ఇదే చెబుతున్నాయి.…
ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో పెద్ది విడుదల తేదీ గురించి ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 30 రాదని కన్ఫర్మ్ అయ్యాక…
భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగిపోతోంది. ఇన్నాళ్లూ అతను ఆడుతున్న…