బహుభాషా నటుడు.. ఫైర్బ్రాండ్ ప్రకాష్ రాజ్.. తాజాగా చేసిన ట్వీట్.. రాజకీయంగా సంచలనంగా మారింది. తరచుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించే ప్రకాష్ రాజ్.. ఆయన విధానాలను నిశితంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. గతంలో కవులు, రచయిత నిర్బంధాల నుంచి ముస్లింలపై దాడుల వరకు అనేక సందర్భాల్లో ప్రకాష్రాజ్.. తన విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఆయన ప్రధాని మోడీ ని టార్గెట్ చేశారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని.. దేశంలో 8 చీతాలను విడుదల చేశారు. దేశంలో 70 ఏళ్ల కిందటే అంతరించిన.. చీతాలను నమీబియా దేశం నుంచి తీసుకువచ్చి.. మరీ.. మధ్యప్రదేశ్ లోని కునో.. జాతీయ పార్కులో మోడీ విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన.. గత కాంగ్రెస్పైనా విమర్శలు గుప్పించారు. అంతరించిపోయిన.. చీతాలను దేశంలోకి తిరిగి ప్రవేశ పెట్టాలన్న ధ్యాస.. ఏమాత్రం లేదని.. నిప్పులు చెరిగారు.
తాను తీసుకున్న చర్యల కారణంగానే.. దేశంలో తిరిగి చీతాల సందడి ప్రారంభమైందని అన్నారు. అయితే.. దీనిపై ప్రకాష్ రాజ్ ఆసక్తిగా స్పందించారు. “ఎక్కడో అడవుల్లో ప్రశాంతంగా ఉండే.. చీతాలను దేశానికి తీసుకువచ్చారు. బాగానే ఉంది. కానీ, దేశ సంపదను కొల్లగొట్టి.. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో తీసుకుని దేశం వదిలి పారిపోయిన ‘చీతాల’ సంగతేంటని ప్రశ్నించారు.
నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, చౌక్సీ వంటి ఘరానా చీతాలు.. ప్రపంచ దేశాల్లో.. కాలర్ ఎగురేసుకుని.. తిరుగుతున్నారని.. వాటిని ఎప్పుడు దేశానికి తీసుకువస్తారో చెప్పాలని.. ప్రధాని మోడీని ప్రశ్నించారు ప్రకాష్రాజ్. దేశాన్ని కొల్లగొట్టి.. ప్రస్తుతం విదేశాల్లోదాక్కొన్న వీరిని తిరిగి రప్పించే ప్రయత్నాల విషయంలో మోడీ సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నది ప్రకాష్ రాజ్ విమర్శ. మరిదీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on September 18, 2022 2:33 pm
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…