బహుభాషా నటుడు.. ఫైర్బ్రాండ్ ప్రకాష్ రాజ్.. తాజాగా చేసిన ట్వీట్.. రాజకీయంగా సంచలనంగా మారింది. తరచుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించే ప్రకాష్ రాజ్.. ఆయన విధానాలను నిశితంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. గతంలో కవులు, రచయిత నిర్బంధాల నుంచి ముస్లింలపై దాడుల వరకు అనేక సందర్భాల్లో ప్రకాష్రాజ్.. తన విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఆయన ప్రధాని మోడీ ని టార్గెట్ చేశారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని.. దేశంలో 8 చీతాలను విడుదల చేశారు. దేశంలో 70 ఏళ్ల కిందటే అంతరించిన.. చీతాలను నమీబియా దేశం నుంచి తీసుకువచ్చి.. మరీ.. మధ్యప్రదేశ్ లోని కునో.. జాతీయ పార్కులో మోడీ విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన.. గత కాంగ్రెస్పైనా విమర్శలు గుప్పించారు. అంతరించిపోయిన.. చీతాలను దేశంలోకి తిరిగి ప్రవేశ పెట్టాలన్న ధ్యాస.. ఏమాత్రం లేదని.. నిప్పులు చెరిగారు.
తాను తీసుకున్న చర్యల కారణంగానే.. దేశంలో తిరిగి చీతాల సందడి ప్రారంభమైందని అన్నారు. అయితే.. దీనిపై ప్రకాష్ రాజ్ ఆసక్తిగా స్పందించారు. “ఎక్కడో అడవుల్లో ప్రశాంతంగా ఉండే.. చీతాలను దేశానికి తీసుకువచ్చారు. బాగానే ఉంది. కానీ, దేశ సంపదను కొల్లగొట్టి.. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో తీసుకుని దేశం వదిలి పారిపోయిన ‘చీతాల’ సంగతేంటని ప్రశ్నించారు.
నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, చౌక్సీ వంటి ఘరానా చీతాలు.. ప్రపంచ దేశాల్లో.. కాలర్ ఎగురేసుకుని.. తిరుగుతున్నారని.. వాటిని ఎప్పుడు దేశానికి తీసుకువస్తారో చెప్పాలని.. ప్రధాని మోడీని ప్రశ్నించారు ప్రకాష్రాజ్. దేశాన్ని కొల్లగొట్టి.. ప్రస్తుతం విదేశాల్లోదాక్కొన్న వీరిని తిరిగి రప్పించే ప్రయత్నాల విషయంలో మోడీ సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నది ప్రకాష్ రాజ్ విమర్శ. మరిదీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on September 18, 2022 2:33 pm
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…