ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఏదోరకంగా ఇరికించటమే నరేంద్రమోడీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మోడీకి కేజ్రీవాల్ కు ఏమాత్రం పడటంలేదని అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రిగా ఉన్న మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కంట్లో నలుసులాగ తయారయ్యారు. పైగా వరసగా మూడుసార్లు బీజేపీని దెబ్బకొట్టి ఆప్ అధికారంలోకి రావటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోంది. అందుకనే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏదోరకంగా ఇబ్బంది పెడుతునే ఉంది.
తాజాగా లోఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించాలని లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా డిసైడ్ చేశారు. సక్సేనాకు కేజ్రీవాల్ కు ఏమాత్రం పడటంలేదు. ఎల్జీని ముందుపెట్టుకుని మోడీ ప్రభుత్వం వెనకనుండి వ్యవహారాలను నడుపుతోంది. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఎల్జీ అడ్డంకొడుతున్నారు. దాంతో వీళ్ళిద్దరి మధ్య ప్రత్యక్ష వివాదమే నడుస్తోంది.
ఈ నేపధ్యంలోనే బస్సుల కొనుగోలు ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని ఎల్జీ నిర్ణయించటం మరో వివాదంగా మారే అవకాశముంది. 2019లో ఆప్ ప్రభుత్వం 1000 లో ఫ్లోర్ బస్సులను కొన్నపుడు అవకతవకలు జరిగాయని ఎవరో ఎల్జీకి ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదును పట్టుకుని ఇపుడు ఎల్జీ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఇదే విషయమై దాదాపు ఏడాది క్రితమే విచారణ జరిగింది. ఆ విచారణలో పెద్దగా ఏమీ తేలలేదట. మరి తొందరలో మొదలవ్వబోయే సీబీఐ విచారణ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఈమధ్యనే లిక్కర్ స్కాం జరిగిందని కేంద్రం సీబీఐతో విచారణ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆఫీసు, ఇంట్లో సీబీఐ సోదాలు జరిపింది. బ్యాంకు ఖాతాలను, లాకర్లను కూడా తనిఖీచేసింది. ఎంతగా దర్యాప్తు జరిగినా మనీష్ కు వ్యతిరేకంగా ఆధారాలను సీబీఐ సంపాదించలేకపోయింది. ఇంకా ఆ వివాదం నడుస్తుండగానే లో ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలంటు సీబీఐ విచారణకు ఆదేశించింది.
This post was last modified on September 12, 2022 12:49 pm
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…
నాలుగు నెలల నుంచి విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్న జన నాయకుడు వ్యవహారాలు మెల్లగా ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. మే…
జెట్లీ ఫలితం ఏమైందనేది కాసేపు పక్కనపెడితే కమెడియన్ సత్య క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఏంటో నిన్న ఓపెనింగ్స్ తో అర్థమయ్యింది.…
జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కొన్నాళ్ల కిందట ముక్కుకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో…
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…