Political News

ఏదోరకంగా ఇరికించటమే టార్గెట్టా ?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఏదోరకంగా ఇరికించటమే నరేంద్రమోడీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మోడీకి కేజ్రీవాల్ కు ఏమాత్రం పడటంలేదని అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రిగా ఉన్న మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కంట్లో నలుసులాగ తయారయ్యారు. పైగా వరసగా మూడుసార్లు బీజేపీని దెబ్బకొట్టి ఆప్ అధికారంలోకి రావటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోంది. అందుకనే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏదోరకంగా ఇబ్బంది పెడుతునే ఉంది.

తాజాగా లోఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించాలని లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా డిసైడ్ చేశారు. సక్సేనాకు కేజ్రీవాల్ కు ఏమాత్రం పడటంలేదు. ఎల్జీని ముందుపెట్టుకుని మోడీ ప్రభుత్వం వెనకనుండి వ్యవహారాలను నడుపుతోంది. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఎల్జీ అడ్డంకొడుతున్నారు. దాంతో వీళ్ళిద్దరి మధ్య ప్రత్యక్ష వివాదమే నడుస్తోంది.

ఈ నేపధ్యంలోనే బస్సుల కొనుగోలు ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని ఎల్జీ నిర్ణయించటం మరో వివాదంగా మారే అవకాశముంది. 2019లో ఆప్ ప్రభుత్వం 1000 లో ఫ్లోర్ బస్సులను కొన్నపుడు అవకతవకలు జరిగాయని ఎవరో ఎల్జీకి ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదును పట్టుకుని ఇపుడు ఎల్జీ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఇదే విషయమై దాదాపు ఏడాది క్రితమే విచారణ జరిగింది. ఆ విచారణలో పెద్దగా ఏమీ తేలలేదట. మరి తొందరలో మొదలవ్వబోయే సీబీఐ విచారణ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఈమధ్యనే లిక్కర్ స్కాం జరిగిందని కేంద్రం సీబీఐతో విచారణ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆఫీసు, ఇంట్లో సీబీఐ సోదాలు జరిపింది. బ్యాంకు ఖాతాలను, లాకర్లను కూడా తనిఖీచేసింది. ఎంతగా దర్యాప్తు జరిగినా మనీష్ కు వ్యతిరేకంగా ఆధారాలను సీబీఐ సంపాదించలేకపోయింది. ఇంకా ఆ వివాదం నడుస్తుండగానే లో ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలంటు సీబీఐ విచారణకు ఆదేశించింది.

This post was last modified on September 12, 2022 12:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

1 hour ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

6 hours ago