Political News

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌.. ‘ఖ‌ర్చు’ రాజ‌కీయాలు

‘త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా!’ అన్న సామెత‌ను నిజం చేస్తున్నారు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్‌గాంధీ.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై ఉద్యమం చేస్తున్నారు. దీనిలో భాగంగా.. ఆయ‌న భార‌త్ జోడో(భార‌త స‌మైక్య‌త‌) యాత్ర‌ను ప్రారంభించారు. 3500 కిలో మీట‌ర్ల మేర ఆసేతు హిమాచ‌లం పాద‌యాత్ర చేసి.. మోడీ ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ముఖ్యంగా పెట్రోలు ధ‌ర‌లు.. గ్యాస్ ధ‌ర‌లు.. బియ్యం, ప‌ప్పుదినుసుల ధ‌ర‌ల పెంపును ఆయ‌న వ్య‌తిరేకిస్తున్నారు.

మోడీ పాల‌న‌లో ప్ర‌జ‌లు బ్ర‌త‌క‌లేక‌పోతున్నార‌ని.. రాహుల్ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. గ‌త యూపీఏ పాల‌న‌లో 400 ఉన్న గ్యాస్ సిలెండ‌ర్ ధ‌ర‌.. ఇప్పుడు 1100ల‌కు చేరింద‌ని.. పెట్రోల్ అప్ప‌ట్లో 60గా ఉంటే.. ఇప్పుడు సెంచ‌రీ కొట్టింద‌ని.. బియ్యం అప్ప‌ట్లో 25 ఉండే.. ఇప్పుడు 50 దాటింద‌ని.. ఇలా లెక్క‌లు వ‌క్కాణిస్తూ.. ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. ఈ స‌మ‌యంలోనే బీజేపీ నేత‌లు.. రాహుల్ను కార్న‌ర్ చేశారు. “రాహుల్ పెరిగిన ధ‌ర‌ల‌పై యుద్ధం చేస్తున్నారు.. కానీ.. ఆయ‌న 41 వేల ఖ‌రీదైన టీష‌ర్టు వేసుకుని. న‌వ్విపోతార‌న్న ధ్యాస కూడా లేకుండా!” అని బీజేపీ నేత‌లు నిప్పులు చెరిగారు.

దీంతో కాంగ్రెస్ నాయ‌కులు కూడా అంతే దీటుగా స్పందించారు. ప్ర‌ధాని మోడీ.. వేసుకునే సూటు, లాల్చీ.. ధ‌ర‌ల‌ను రోడ్డెక్కించా రు. 10 ల‌క్ష‌ల విలువ చేసే.. సూటును మోడీ ధ‌రిస్తున్నార‌ని.. చెప్పారు. అంతేకాదు.. మోడీ వేసుకునే బూట్లు ఏకంగా రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ వ‌ర్సెస్‌బీజేపీల మ‌ధ్య పెరుగుతుంద‌ని అనుకున్న వాగ్బాణాలు మ‌టు మాయ‌మ‌య్యాయి. అయితే.. ఈ విష‌యంపైనెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. గాంధీ వార‌సుల‌మ‌ని చెప్పుకొనే.. కాంగ్రెస్ నేత‌లు.. ఖ‌రీదైన బ‌ట్ట‌లు వేసుకుని ఉద్య‌మాలు చేయ‌డం ఏమిటో? అని పెద‌వి విరుస్తున్నారు.

ఇక‌, బీజేపీని కూడా ఆట‌ప‌ట్టిస్తున్నారు. “చాయ్‌వాలాకు ప‌ది ల‌క్ష‌ల సూటు ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో!” అనే కామెంట్లు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు పేద‌ల‌కు చేసింది ఏమిట‌నేది.. విశ్లేష‌కులు ప్ర‌శ్న‌. ఎవ‌రు అధికారంలో ఉన్నా.. ప్ర‌జ‌ల‌ను పీల్చి పిప్పి చేసే నిర్ణ‌యాలే తీసుకున్నార‌ని.. స‌గ‌టు పౌరుడు నిప్పులు చెరుగుతున్నాడు. మీరు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అనుకుంటే.. ముందు సాధార‌ణ వ్య‌క్తులుగా మారాలంటూ.. నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన నాయ‌కుల నుంచి ప్ర‌జ‌ల‌ను దోచుకునే నాయ‌కులు దేశం పెరుగుతున్నార‌ని.. మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమ‌నా.. వేలు వ‌ర్సెస్ ల‌క్ష‌లు అంటూ.. కాంగ్రెస్‌, బీజేపీలు చేసుకున్న కామెంట్లు.. ఆ పార్టీల‌పై స‌టైర్లు కురిపించేలా చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 10, 2022 10:16 pm

Share

Recent Posts

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

1 hour ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

1 hour ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

3 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

4 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

5 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

6 hours ago