Political News

రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూల్చేస్తున్న మోడీ: కేసీఆర్

దేశం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ఇప్పటి వరకు ఒక్క మంచి పనిచేయలేదని మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంతో పాటు దేశం బాగుండాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపాల్సిన ప్రధాని మోడీయే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.

ఇవాళ ఏం లొల్లి జరుగుతోంది. కేంద్రంలో ఉండే ప్రధానమంత్రే 9 రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను కూలగొట్టారు. తమిళ నాడు, పశ్చిమబెంగాల్, డిల్లీ ప్రభుత్వాలను కూలగొడతారంటా. బెంగళూరు అనేది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఇవాళ ఏం జరుగుతోంది. ఈ ఏడాది మన హైదరాబాద్లోనే ఎక్కువ ఉద్యోగాలొచ్చాయి. కారణం ఏంటంటే బెంగ‌ళూరులో మత విద్వేషాలు రెచ్చగొట్టడం. కేంద్ర ప్రభుత్వం ఒక్కటైనా మంచిపని చేసిండ్రా. ఒక్క ప్రాజెక్ట్ కట్టిండ్రా. ఏం చేసిండ్రు అని అడుగుతున్నా. కనీసం మంచినీళ్లు ఇచ్చే తెలివి లేదా? దేశానికి కనీసం మంచినీళ్లు ఇవ్వలేరా? 70 టీఎంసీల నీళ్లు నదుల్లో పారుతూ ఉంటే మీకు సోయి లేదా?అని నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రిగా తాను, ప్రధానిగా మోడీ ఒకేసారి ప‌ద‌వుల్లోకి వ‌చ్చామ‌ని.. కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు ఇవ్వడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను మౌనంగా భరిద్దామా? పిడికిలి బిగించి కొట్లాడుదామా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ వ్యవస్థలను ఆగం చేస్తున్నారని సీఎం కేసీఆర్ అగ్రహం వ్యక్తం చేశారు. డిల్లీలో రూ.25 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామని అంటున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు.  

నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను ఆగం కానివ్వనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మత పిచ్చిగాళ్ల ఎలాంటి దుర్మార్గాలను సాగనివ్వనని హెచ్చరించారు. మత పిచ్చికి లోనైతే బతుకులు ఆగమవుతాయన్నారు. స్వార్థ మత పిచ్చిగాళ్లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సమాజంలో అసూయ, ద్వేషం పెరిగితే భారత్తో పాటు తెలంగాణ 100 ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారు. మోడీ.. మేము మనుషులం కాదా? దేశంలో భాగం కాదా? అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  జాతీయ రాజకీయాల్లో ఉజ్వల పాత్ర నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

This post was last modified on August 25, 2022 10:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago