Political News

గోరంట్ల మాధవ్‌.. కథ ముగిసినట్లేనా?

ఇప్పుడు తెలుగు నెటిజన్ల దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తున్న అంశం.. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారమే. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో నేతల రాసలీలల గురించి వార్తలు రావడం తొలిసారేమీ కాదు. ఆ పార్టీకి ఒకప్పుడు మద్దతుదారుగా ఉన్న కమెడియన్ పృథ్వీ ఒక మహిళతో జరిపినట్లుగా ప్రచారం జరిగిన సరస సంభాషణ అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

ఇక ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌లు సైతం ఇలాంటి కుంభకోణాల్లోనే ఇరుక్కున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే వీరిలో పృథ్వీ పదవి కోల్పోయి, చివరికి వైకాపాకు దూరం కావాల్సి వచ్చింది. ఐతే అంబటి రాంబాబు పేరుతో ఒకటికి రెండు ఆడియోలు వార్తల్లోకి వచ్చినా, అవంతి పేరు మీద కూడా ఒక ఆడియో హల్‌చల్ చేసినా వారి మీద ఎలాంటి విచారణ, చర్యలు చేపట్టలేదు వైకాపా. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలేంటన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి.

కట్ చేస్తే ఇప్పుడు గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రత్యర్థులు వైకాపాను మామూలుగా టార్గెట్ చేయట్లేదు. ఈ విషయాన్ని మాధవ్ పట్టించుకోకుండా వదిలేసినా పోయేదేమో. కానీ ఆయన మీడియా ముందుకు వచ్చారు. వీడియో మార్ఫింగ్ చేశారని, అందులో ఉన్నది తాను కాదని వాదించారు. కానీ వీడియోను పరిశీలిస్తే జనాలకు అలాంటి అనుమానం అయితే కలగట్లేదు.

అలా అని మాధవ్ విషయంలో ఒక నిర్ణయానికి కూడా వచ్చేయలేం. ఈ వీడియో విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని, కోర్టుకు ఎక్కబోతున్నానని మాధవ్ అన్నారు. ఆయన ఎంత వరకు వెళ్తారు.. పోలీసులు, నిపుణులు ఏం తేలుస్తారు.. మాధవ్ విషయంలో జనాభిప్రాయం ఏంటి అన్నది పక్కన పెడితే.. మాధవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ, అక్కడి ప్రభుత్వం ఈ వీడియో విషయంలో ఎలా స్పందిస్తుందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే అంబటి రాంబాబు, అవంతిల విషయంలో మాదిరి ఈ విషయాన్ని చూసీ చూడనట్లు విడిచిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు.

ఈ వీడియోపై విచారణ జరుపుతున్నామని, అది మార్ఫ్డ్‌కాదు, ఒరిజినల్ అని తేలితే చర్యలు ఉంటాయని ప్రభుత్వ సలహాదారు, పార్టీ అగ్ర నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆయన ఇలా స్పందించారంటేనే ఇష్యూను సీరియస్‌గా తీసుకున్నారన్నది స్పష్టం. వీడియో ఒరిజినలే అని మెజారిటీ జనం భావిస్తున్న నేపథ్యంలో దాని వల్ల వ్యక్తిగతంగా జరిగే డ్యామేజీకి తోడు పార్టీ, ప్రభుత్వం తరఫున కూడా చర్యలు చేపడితే రాజకీయంగా గోరంట్ల మాధవ్ కథ ముగిసినట్లే అన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on August 5, 2022 9:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

1 hour ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

3 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

3 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

4 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

5 hours ago