Political News

జ‌గ‌న్ స‌ర్‌.. మోడీ మీరు అనుకున్న‌ట్టు లేరుగా!

రాజ‌కీయాల్లో ఎవ‌రు ఎప్పుడు ఎలాంటి వ్యూహాల‌తో ముందుకు సాగుతారో అనేది ఆస‌క్తిక‌ర విష‌య‌మే. అవకాశం.. అవ‌స‌రం .. అనే రెండు ప‌ట్టాల‌పైనే రాజ‌కీయాలు ముందుకు సాగుతాయి. కేంద్రంతోతాను స‌ఖ్య‌త‌గా ఉంటే.. ఏపీకి అన్నీ స‌మ‌కూరుతాయ‌నేది సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌. ఎందుకంటే.. ఏపీ అనేక ఇబ్బందులలో ఉందని.. రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత‌.. కేంద్రం నుంచి సాయం లేక‌పోతే.. రాష్ట్ర ముందుకు సాగ‌ద‌ని.. జ‌గ‌న్ న‌మ్ముతున్నారు. ఈ క్ర‌మంలోనే కేంద్రాన్ని మ‌చ్చిక చేసుకుని ముందుకు సాగుతున్నారు.

ఇక‌, కేంద్రం కూడా.. ఏపీలోని అధికార పార్టీకి ఎంపీల బ‌లం ఉన్న‌నేప‌థ్యంలో అనుకూలంగానే ఉంది. ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన అనేక విష‌యాల్లో వైసీపీ సాయం కూడా తీసుకుంది. వ్య‌వ‌సాయ చ‌ట్టాలు.. 370 ఆర్టిక ల్ ర‌ద్దు.. తాజాగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు.. వంటి విష‌యాల్లో వైసీపీ మ‌ద్ద‌తు బీజేపీ తీసుకుంది. దీంతో వైసీపీకి అన్నివిధాలా కేంద్రం స‌హ‌క‌రిస్తుంద‌ని.. జ‌గ‌న్ భావిస్తూ.. వ‌స్తున్నారు. కానీ, అన్ని విష‌యాల్లోనూ.. మోడీ స‌ర్కారు స‌హ‌క‌రించ‌ద‌నే సంచ‌ల‌న విష‌యం.. తాజాగా వెలుగు చూసింది.

ఎందుకంటే.. దేశ‌భ‌ద్ర‌త‌కు సంబంధించిన‌విష‌యాల్లో తాను ఎక్క‌డ ఇరుక్కుంటాన‌ని భావిస్తున్న మోడీ స‌ర్కారు.. కొన్నికొన్ని విష‌యాల్లో తాను త‌ప్పించేసుకుని.. జ‌గ‌న్ స‌ర్కారును ఇరికించేస్తోంద‌నే టాక్ వినిపి స్తోంది. తాజాగా పార్ల‌మెంటు సాక్షిగా జ‌రిగిన ఘ‌ట‌న దీనినే రుజువు చేసింది. బీచ్ సాండ్(తీర ప్రాంతాల్లో ల‌భించే ఇసుక‌) మైనింగ్ కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరింది.  

అయితే.. దీనికి కేంద్రం  నో అని చెప్పింది. ఈ విష‌య‌మే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారింది. పోనీ ఏపీ సర్కార్ ప్రతిపాదనను పక్కన పెడితే పెట్టవచ్చు కానీ కొన్ని కీలక కామెంట్స్ కూడా చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది. బీచ్ సాండ్ నుంచి అణు ఇంధనానికి అవసరమైన మోనోటైజ్ ని ప‌క్క‌కు త‌ప్పిస్తున్నార‌నేది.. దీనిని అక్రమంగా విదేశాలకు పంపిస్తున్నార‌నేది కేంద్రం ఆరోప‌ణ‌.

దీనికి సంబంధించి ఇప్ప‌టికే రాష్ట్ర స‌ర్కారును కేంద్రం వివ‌ర‌ణ కోరింది. అయితే.. ఈ వివ‌ర‌ణ‌కు కేంద్రం సంతృప్తి చెంద‌లేదు. ఈ నేప‌థ్యంలోనే తామే స్వ‌యంగా రంగంలోకి దిగి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత త‌వ్వ‌కం జ‌రిగింద‌నే విష‌యంపై నిజాలు నిగ్గుతేలుస్తామ‌ని.. పేర్కొంది. ఈ ఫిర్యాదుల మీద అణు ఇంధన శాఖ సూచనలతో దర్యాప్తు చేపట్టాలని బ్యూరో ఆఫ్ మైన్స్ కి ఆదేశాలను  ఇచ్చినట్లు కేంద్ర మంత్రి చెబుతున్నారు.

ఈ అంశాలన్నీ కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. మొత్తానికి చూస్తే ఏపీ సర్కార్ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చడమే కాకుండా.. ఇక్క‌డ జ‌రిగిన త‌వ్వ‌కాలు.. ఎగుమ‌తుల‌పై కూడా నిఘా పెట్ట‌డం.. ద‌ర్యాప్తు చేప‌ట్ట‌డం వంటివి చూస్తే.. “త‌మ్ముడు త‌మ్ముడే“ అన్న సామెత‌ను మోడీ గుర్తు చేస్టున్న‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాల‌కు.. మోడీ గుడ్డిగా అయితే.. ఫాలో కార‌ని చెబుతున్నారు.

This post was last modified on August 5, 2022 11:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

2 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

3 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

4 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

5 hours ago