Political News

చ‌నిపోయినా పింఛ‌ను.. ప‌థ‌కాలు.. ద‌టీజ్ వైసీపీ?

అయ్యా.. మేం క‌ష్టాల్లో ఉన్నాం.. మాకు ఆద‌రువు లేదు.. పింఛ‌ను ఇచ్చి పుణ్యం క‌ట్టుకోండి..అంటూ.. చాలా మంది వృద్ధులు..అర్హులైన పేద‌లు.. స‌ర్కారుకు మొర పెట్టుకుంటున్న విష‌యం త‌ర‌చుగా క‌నిపిస్తోంది. వైసీపీ ప్ర‌భుత్వం తాజాగా నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అయితే.. దీనిపై ప్ర‌భుత్వం మాత్రం చూస్తాం..చేస్తాం..అంటూకాలం గ‌డిపేస్తోంది.

ఇదిలావుంటే.. తాజాగా.. ఓ సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది. ఓ చ‌నిపోయిన వ్య‌క్తికి మూడేళ్లుగా ఠంచనుగా పింఛ‌ను ఇస్తున్నారు. అంతేకాదు.. రైతు భ‌రోసా కింద కూడా ఆయ‌నకు నిధులు ఇస్తున్నారు. ఇది ఇన్నాళ్ల‌కు వెలుగు చూసింది. అది ఎక్క‌డో కాదు.. వైసీపీ స‌ర్కారు హ‌యాంలోనే.. అది కూడా కృష్ణాజిల్లాలోనే కావ‌డం.. ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఈ విష‌యం కూడా మంత్రి జోగి ర‌మేష్ నిర్వ‌హించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలోనే బ‌య‌ట ప‌డ‌డం గ‌మ‌నార్హం.

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడకు చెందిన రాజులపాటి సత్యనారాయణ 2013లో మృతి చెందారు. ఆయనకు గత మూడేళ్లుగా వైఎస్‌ఆర్‌ పింఛను కానుక కింద రూ. 33,500.. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద రూ. 34,500 ఇచ్చినట్లు.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి జోగి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు దీనికి సంబంధించిన ‘సంక్షేమ బావుటా’ పత్రాన్ని అందజేశారు.

దీనికి ఆశ్చర్యపోయిన సత్యనారాయణ కుమారుడు జగదీశ్‌.. మా నాన్న చ‌చ్చిపోయి చాలా ఏళ్లు అయింది.  ఆయ‌న పేరుతో ఎలాంటి ఫించ‌ను కూడా లేదు..  ఆ సొమ్ము ఎవరు తీసుకున్నారో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై  మంత్రి వెంట‌నే స్థానిక వాలంటీరును ప్రశ్నించగా అదే పేరుతో మరో వ్యక్తి ఇంకో వార్డులో ఉండి ఉంటారని తెలిపినట్లు జగదీశ్‌ పేర్కొన్నారు. దీనిపై ఎంపీడీవో ఏవీ నాంచారరావును మంత్రి వివరణ కోరగా ఈ విషయం ఇప్పుడే తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతామని తెలిపారు.

అయితే.. దీనిపై స్థానికులు పెద‌వి విరుస్తున్నారు. ఒకే పేరుతొ మ‌రో వ్య‌క్తి ఉండొచ్చ‌ని.. కానీ, ఆయ‌న వ‌య‌సు , ఈయ‌న వ‌య‌సు ఎలా ఒక‌టే అవుతుంద‌ని అంటున్నారు. అంతేకాదు.. ఆయ‌న వ్య‌వ‌సాయం చేస్తున్నార‌న్న గ్యారెంటీ ఏంట‌ని కూడా వ‌లంటీర్‌ను నిల‌దీశారు. ప్ర‌స్తుతం ఇది వ‌లంటీర్ మెడ‌కు చుట్టుకుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on August 5, 2022 10:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్రియేటివిటీ ప్రోమోల‌కే ప‌రిమిత‌మా?

గ‌త శుక్ర‌వారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది క‌మెడియ‌న్ స‌త్య హీరోగా ప‌రిచయం అయిన సినిమా. అయినా స‌రే..…

58 minutes ago

తెలుగోళ్లు లేపుతుంటే… తమిళోళ్లు ముంచేస్తున్నారు

ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…

4 hours ago

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

5 hours ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

8 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

9 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

13 hours ago