కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్…ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈయన గురించి పరిచయం అక్కర లేదు. క్రైస్తవ మత ప్రబోధకుడిగా దాదాపు 200 దేశాల్లో ‘మత ప్రచారం’ చేస్తున్నానని చెబుతుంటారు పాల్. ఇక, ఏపీ, తెలంగాణలో ప్రజా శాంతి పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించిన పాల్…తానే కాబోయే సీఎం నంటూ ప్రతి ఎన్నికల ముందు హడావిడి చేస్తూ కావాలసినంత కామెడీని కూడా పండిస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా పాల్ కామెడీగా కాకుండా…సీరియస్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఏసు క్రీస్తు క్రిస్టియన్ కాదు.. హిందువూ కాదు.. మహమ్మదీయుడు కూడా కాదు.. ఆయన దైవ కుమారుడు..’ అంటూ కేఏ పాల్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. అంతేకాదు, తాను హిందువుగా జన్మించాననీ, హిందువుగానే మరణిస్తానని కూడా పాల్ సంచలన ప్రకటన చేశారు.
మతపరమైన కామెంట్లతో పాటు పొలిటికల్ గా కూడా పాల్ తన మార్క్ కామెంట్లతో మరోసారి కామెడీ చేశారు. చంద్రబాబు, కేసీఆర్, జగన్, గాంధీ కుటుంబ పార్టీలను జనం చిత్తుచిత్తుగా ఓడిస్తారని, ఇప్పుడైనా జనం తెలివితేటలుపయోగించి తన ప్రజాశాంతి పార్టీకి ఓటేయాలని రిక్వెస్ట్ కమ్ డిమాండ్ చేశారు పాల్. ఇక, ఒక్క ఓటు బీజేపీకి, మోదీకి, వైసీపీకి, టీడీపీకి వేయవద్దని పిలుపునిచ్చారు పాల్..
చిటికేసి లక్ష కోట్లు సంపాదిస్తా…ఐదు లక్షల కోట్లు దానం చేశానంటూ పాల్ విసిరిన పంచ్ డైలాగులకు ప్రెస్ క్లబ్ లోని జర్నలిస్టులు నవ్వాపుకోలేకపోయారు. తనకు, తన భార్యకు లక్ష రూపాయల ఆస్తి లేదని చెప్పుకొచ్చారు పాల్. అంతేకాదు, రూ.7 లక్షల కోట్ల అప్పులతో కోమాలో ఉన్న ఏపీని ఆదుకునే అవకాశమివ్వాలని కోరారు పాల్. మనో నేత్రాలు తెరచి మీకొరకు నాకు ఓట్లు వేయండి… ఏపీలో మంచి మహిళను సీఎం ను చేస్తా…తెలంగాణలో నేనే సీఎం అంటూ పాల్ చెప్పిన డైలాగ్ ప్రెస్ మీట్ మొత్తానికే హైలైట్. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు..ఆ సంగతి వారికీ తెలుసు అంటూ జగన్ పై పాల్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
This post was last modified on August 2, 2022 9:51 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…