ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి థియేటర్లకు వాళ్లను రప్పించడం చాలా పెద్ద సవాలుగా మారిపోతోంది. క్రేజీ కాంబినేషన్లలో తీసిన సినిమాలు కూడా జనాల దృష్టిని ఆకర్షించలేకపోతుండటం ఇండస్ట్రీ వర్గాలను కలవరానికి గురి చేస్తోంది. ప్రి రిలీజ్ బజ్ క్రియేట్ కాకపోతే ఎంత భారీ చిత్రానికైనా ఓపెనింగ్స్ రావట్లేదు. ఇక టాక్ తేడా వస్తే అంతే సంగతులు.
‘ఆచార్య’ లాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పరాభవం ఎదురైందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల పరంగా హడావుడి చేయడం, ప్రోమోలు క్రేజీగా ఉండేలా చూసుకోవడం, సినిమా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకోవడం కీలకంగా మారుతోంది. ఇలాంటి టైంలో సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా చాలా నెలల నుంచి అసలు చర్చల్లోనే లేదు.
సమంత ఈ సినిమాలో లైనప్లో ‘శాకుంతలం’ పేరుతో ఒక సినిమా ఉందన్న విషయాన్నే జనాలు మరిచిపోయారంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాను సమంత పూర్తి చేసి పది నెలలు దాటిపోయింది. అప్పట్నుంచి అసలు సినిమా వార్తల్లోనే లేదు. ఈ మధ్య చిత్ర నిర్మాత అయిన నీలిమ గుణ.. తమ సినిమా ఈ సంవత్సరమే రిలీజవుతుందని క్లారిటీ ఇచ్చింది తప్ప అంతకుమించి సినిమా గురించి ఏ సమాచారం పంచుకోలేదు. దీంతో సామ్ అభిమానులు సోషల్ మీడియాలో దర్శకుడు గుణశేఖర్ను ట్యాగ్ చేసి సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు సమాధానం చెప్పారు. ‘శాకుంతలం’ భారీ గ్రాఫిక్స్తో ముడిపడ్డ సినిమా అని, అందుకోసం చాలా సమయం, శ్రమ అవసరం పడుతున్నాయని.. అందుకే ఈ ఆలస్యం అని అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.
ప్రేక్షకులకు బెస్ట్ మూవీ అందించాలన్నదే తమ తాపత్రయం అని, అంత వరకు వేచి చూడాలని ఆయన కోరారు. ఐతే రాజమౌళి ఇంతకంటే భారీ చిత్రాలే తీస్తాడు. ఆయన టీం నెలల తరబడి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయి ఉంటుంది. కానీ తీరిక లేకుండా ఆ పని చేస్తూనే.. మరోవైపు ఒక క్రమ పద్ధతిలో ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ సినిమాను వార్తల్లో ఉండేలా చూస్తుంది. హైప్ పెంచుతుంది. ఈ విషయంలో గుణశేఖర్ సహా అందరూ రాజమౌళి చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on August 2, 2022 7:40 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…