కరోనాకు ఆ మందు పని చేస్తోందట.. ఈ మందు మంచి ఫలితాలనిస్తోందట.. అని వార్తలు చాలా మామూలైపోయాయి ఈ మధ్య. ఐతే వ్యాధి తీవ్రతను బట్టి, అది సోకిన మనుషుల్ని బట్టి వివిధ స్థాయిల్లో పని చేసే మందులైతే వచ్చాయి కానీ.. నూటికి నూరు శాతం కరోనాను తగ్గించే మందు అయితే ఇంకా ఏదీ రాలేదు. ఐతే కరోనాను నియంత్రించాలంటే మందు కంటే ముందు వ్యాక్సిన్ రావడం ముఖ్యం అన్నది నిపుణుల మాట.
వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా సోకే అవకాశమే ఉండదు. అప్పుడు ఆటోమేటిగ్గా వైరస్ అదుపులోకి వస్తుంది. అది జరిగినప్పుడే కరోనా అంతమవుతుందన్న ఉద్దేశంతో వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారంతా. ఐతే ఏ కొత్త వ్యాధికైనా వ్యాక్సిన్ తయారు చేయడం అన్నది ఏళ్ల పాటు సాగే ప్రక్రియ. కాకపోతే కరోనా తీవ్రత, ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం దృష్ట్యా వ్యాక్సిన్ తయారీ, దానికి అనుమతుల ప్రక్రియ శరవేగంగా నడుస్తోంది. ప్రభుత్వాలు కూడా వెసులుబాటు ఇచ్చాయి.
భారత్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ.. కరోనా వ్యాక్సిన్ తయారు చేసి మనుషులపై క్లినికల్ ట్రయల్స్ వేసే దశలో ఉంది. ఇంత తక్కువ సమయంలో ఇక్కడి దాకా రావడం విశేషమే అయినా.. అది అన్ని ప్రక్రియలూ దాటుకుని మార్కెట్లోకి రావడానికి ఇంకో ఏడాది అయినా పట్టొచ్చని అంటున్నారు. ఐతే దీని కంటే ముందు పిఫిజర్ అనే ఫార్మాసూటికల్ జెయింట్.. కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసి మనుషుల మీద ట్రయల్స్ కూడా మొదలుపెట్టేయడం విశేషం.
ఈ ప్రయోగాత్మక వ్యాక్సిన్ను ఓ మోస్తరు స్థాయిలో ఉన్న కరోనా పేషెంట్ల మీద ప్రయోగించగా.. మంచి ఫలితాలే వచ్చాయట. కాకపోతే వ్యాక్సిన్ హైడోస్ ఇచ్చినపుడు జ్వరం సహా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయట. ఐతే ఓ జర్నల్ ప్రచురణ ప్రకారం ఈ వ్యాక్సిన్కు దాదాపుగా అనుమతులు వచ్చినట్లే అని.. అదే జరిగితే ఈ ఏడాది చివరికల్లా 10 కోట్ల డోస్లను తయారు చేయాలన్నది పిఫిజర్ లక్ష్యంగా ఉందని అంటున్నారు. మరి ఈ వ్యాక్సిన్కు అంతర్జాతీయంగా అనుమతులు లభిస్తాయేమో చూడాలి.
This post was last modified on July 2, 2020 9:30 am
ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో టీడీపీ అధినేత, ఏపీ సీఎం…
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…