కరోనాకు ఆ మందు పని చేస్తోందట.. ఈ మందు మంచి ఫలితాలనిస్తోందట.. అని వార్తలు చాలా మామూలైపోయాయి ఈ మధ్య. ఐతే వ్యాధి తీవ్రతను బట్టి, అది సోకిన మనుషుల్ని బట్టి వివిధ స్థాయిల్లో పని చేసే మందులైతే వచ్చాయి కానీ.. నూటికి నూరు శాతం కరోనాను తగ్గించే మందు అయితే ఇంకా ఏదీ రాలేదు. ఐతే కరోనాను నియంత్రించాలంటే మందు కంటే ముందు వ్యాక్సిన్ రావడం ముఖ్యం అన్నది నిపుణుల మాట.
వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా సోకే అవకాశమే ఉండదు. అప్పుడు ఆటోమేటిగ్గా వైరస్ అదుపులోకి వస్తుంది. అది జరిగినప్పుడే కరోనా అంతమవుతుందన్న ఉద్దేశంతో వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారంతా. ఐతే ఏ కొత్త వ్యాధికైనా వ్యాక్సిన్ తయారు చేయడం అన్నది ఏళ్ల పాటు సాగే ప్రక్రియ. కాకపోతే కరోనా తీవ్రత, ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం దృష్ట్యా వ్యాక్సిన్ తయారీ, దానికి అనుమతుల ప్రక్రియ శరవేగంగా నడుస్తోంది. ప్రభుత్వాలు కూడా వెసులుబాటు ఇచ్చాయి.
భారత్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ.. కరోనా వ్యాక్సిన్ తయారు చేసి మనుషులపై క్లినికల్ ట్రయల్స్ వేసే దశలో ఉంది. ఇంత తక్కువ సమయంలో ఇక్కడి దాకా రావడం విశేషమే అయినా.. అది అన్ని ప్రక్రియలూ దాటుకుని మార్కెట్లోకి రావడానికి ఇంకో ఏడాది అయినా పట్టొచ్చని అంటున్నారు. ఐతే దీని కంటే ముందు పిఫిజర్ అనే ఫార్మాసూటికల్ జెయింట్.. కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసి మనుషుల మీద ట్రయల్స్ కూడా మొదలుపెట్టేయడం విశేషం.
ఈ ప్రయోగాత్మక వ్యాక్సిన్ను ఓ మోస్తరు స్థాయిలో ఉన్న కరోనా పేషెంట్ల మీద ప్రయోగించగా.. మంచి ఫలితాలే వచ్చాయట. కాకపోతే వ్యాక్సిన్ హైడోస్ ఇచ్చినపుడు జ్వరం సహా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయట. ఐతే ఓ జర్నల్ ప్రచురణ ప్రకారం ఈ వ్యాక్సిన్కు దాదాపుగా అనుమతులు వచ్చినట్లే అని.. అదే జరిగితే ఈ ఏడాది చివరికల్లా 10 కోట్ల డోస్లను తయారు చేయాలన్నది పిఫిజర్ లక్ష్యంగా ఉందని అంటున్నారు. మరి ఈ వ్యాక్సిన్కు అంతర్జాతీయంగా అనుమతులు లభిస్తాయేమో చూడాలి.
This post was last modified on July 2, 2020 9:30 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…