Political News

రేవంత్ రెడ్డి ప్లాన్ హిట్టయినట్టే ఉందే !

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో ఘర్ వాపసీ కార్యక్రమం ఊపందుకుంటోంది. వివిధ కారణాలతో గతంలో కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయిన నేతలందరినీ తిరిగి కాంగ్రెస్ లోకి రావాలంటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. రేవంత్ విజ్ఞప్తికి స్పందన బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. మెల్లిమెల్లిగా ఇతర పార్టీల్లో ఉన్న నేతలు అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ నుండి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు.

తాజాగా హుస్నాబాద్ మాజీ ఎంఎల్ఏ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈమధ్యనే మహబూబ్ నగర్ కు చెందిన ఎర్రసత్యం కూడా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరిద్దరు టీఆర్ఎస్, బీజేపీని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. వీళ్ళే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నలుగురు మాజీ ఎంఎల్ఏలు, ఒక ఎంఎల్సీ టీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి వచ్చేయటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో ఒక మాజీ ఎంఎల్ఏ, మరో మాజీ ఎంఎల్సీ కూడా తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారట.

కాంగ్రెస్ లో నుండి చాలామంది సీనియర్ నేతలు టీఆర్ఎస్ లో చేరినా వాళ్ళల్లో అత్యధికులు పెద్దగా సంతృప్తిగా లేరు. వివిధ కారణాల వల్ల కేసీయార్ కు వాళ్ళు దగ్గరకాలేకపోయారు. దాంతో టీఆర్ఎస్ నేతలకు పార్టీలో చేరిన వాళ్ళకు మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతునే ఉన్నాయి. పైగా వచ్చే ఎన్నికల్లో పార్టీలో చేరిన వాళ్ళల్లో అత్యధికులకు టికెట్లు దక్కే అవకాశాలు కూడా లేవు. దాంతో వాళ్ళల్లో అసంతృప్తి పెరిగిపోతోంది.

సరిగ్గా ఇలాంటి వాళ్ళపైనే రేవంత్ గురిపెట్టారు. అందుకనే అసంతృప్త నేతలంతా టీఆర్ఎస్ లో నుండి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. అయితే ఇలా చేరుతున్న వారిలో చాలామంది విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కూడా అసంతృప్తి పెరిగిపోతోంది. మరిలా చేరుతున్న వాళ్ళందరికీ రేవంత్ ఏమి హామీలిస్తున్నారో బయటకు తెలీటంలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేనపుడు ఎన్నికల సమయంలో వీళ్ళంతా ఎలా రియాక్టవుతారో చూడాలి.

This post was last modified on July 20, 2022 3:42 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago