Political News

తమ్ముడి పై ఫిర్యాదుచేసిన ఎంపీ

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినాని కుటుంబంలో విబేధాలు ముదిరి పాకానపడ్డాయి. తమ్ముడిపైనే ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు బుక్ చేయటం ఇపుడు పార్టీలో సంచలనంగా మారింది. ఎంపీ చేసిన ఫిర్యాదు దాదాపు నెల క్రితం చేస్తే ఇపుడు బయటపడింది. ఇంతకీ ఆ ఫిర్యాదు ఏమిటంటే ఎంపీగా తన పేరున్న స్టిక్కర్ ను ఒక అజ్ఞాత వ్యక్తి కారుకు అతికించుకుని వాడుకుంటున్నారట.

కారు ఎక్కడైనా వివాదంలో ఇరుక్కుంటే తనపేరే ముందు బయటకు వస్తుంది కాబట్టి పోలీసులు వెంటనే తన ఫిర్యాదుపై యాక్షన్ తీసుకోవాలని నాని డిమాండ్ చేశారు. అయితే ఎంపీ చెప్పిన సదరు కారు గడచిన నెలగా హైదరాబాద్ లోని మాదాపూర్ తదితర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎంపీ చెప్పినట్లుగా ఆ కారును గుర్తించి పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. తీరా చూస్తే ఆ కారు ఎంపీ తమ్ముడు కేశినేని చిన్నిదిగా తేలింది. ఆ కారు రిజిస్ట్రేషన్ ప్రకారం చిన్ని భార్య ఝాన్సీ పేరు మీద రిజస్టర్ అయ్యుందట.

అంటే కారుకి తన స్టిక్కర్ ను అతికించుకుని తమ్ముడు తిరుగుతున్న సంగతి ఎంపీకి తెలిసి కావాలనే ఫిర్యాదు చేసినట్లు అర్దమవుతోంది. ఎందుకంటే చాలాకాలంగా ఎంపీకి తమ్ముడు చిన్నీకి పడటంలేదు. టీడీపీకి దూరంగా ఎంపీ వ్యవహరిస్తుండటంతో చంద్రబాబునాయుడు చిన్నీని దగ్గరకు తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా చిన్నీయే పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. హోలు మొత్తంమీద ఎంపీదే పూర్తి తప్పంతా కనబడుతోంది.

పార్టీ ఎంపీగా ఉండదలచుకుంటే పార్టీతోనే ఉండాలి. అలాకాకుండా పార్టీతో అవసరం లేదనుకుంటే పార్టీ ఎవరిని ఎంపీగా పోటీచేయించినా నానికి పట్టించుకోకూడదు. కానీ ఏకకాలంలో నాని పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. చివరినిముషంలో నాని టీడీపీ తరపున పోటీకి నిరాకరిస్తే అప్పుడు పార్టీ ఏమిచేయాలి ? అందుకనే ప్రత్యామ్నాయాన్ని ఇప్పటినుండే చూసుకుంటోంది. దీన్ని ఎంపీ సహించలేకపోతున్నారు. దాంతోనే ఇపుడీ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

This post was last modified on July 20, 2022 12:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

54 minutes ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

2 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

3 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

3 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

5 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

6 hours ago