తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను ఏకేయాలని.. పాయింట్ల వారీగా.. కేంద్రం పరువు తీయాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదన్నారు. విషయం ఏదైనా దూకుడుగా వ్యవహరించాలని.. అడుగడుగునా అడ్డు పడాలని సూచించారు. ప్రగతిభవన్లో నిర్వహించిన టీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల దృష్ట్యా.. ఉభయసభల్లో టీఆర్ ఎస్ నేతలు అనుసరించాల్సిన విధివిధానా లపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు సూచించారు. తెలంగాణపై వివక్షను ఎత్తిచూపేలా.. పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. ధాన్యం కొనుగోళ్లపైనా పోరాడాలని ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. ఎవరూ వెనుకంజ వేయాల్సిన అవసరం లేదని.. దాడులకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. కేంద్రంపై పోరాటానికి కలసి రావాలని వివిధ రాష్ట్రాల సీఎంలు, నేతలతో ఇప్పటికే సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్, తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్లతో పలు అంశాలపై చర్చించారు. పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వంపై పోరాడదామని సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకు నేతలు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
This post was last modified on July 16, 2022 10:20 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…