స్పోర్ట్స్ బయోపిక్.. ఒకప్పుడు బాలీవుడ్కు కాసులు పండించిన జానర్ ఇది. చక్ దే ఇండియా, పాన్ సింగ్ తోమర్, బాగ్ మిల్కా బాగ్ లాంటి సినిమాలు సూపర్ హిట్లవడం.. ఆపై ఎం.ఎస్.ధోనిః ది అన్ టోల్డ్ స్టోరీ, దంగల్, బ్లాక్బస్టర్లు కావడంతో ఇక అందరూ ఆ జానర్ మీద పడిపోయారు.
కానీ అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు.. కాస్త పేరున్న ప్రతి స్పోర్ట్స్ పర్సన్ మీదా సినిమాలు తీయడం మొదలుపెట్టడం.. జనాల ఎమోషన్ పట్టించుకోకుండా ఎగ్జాజరేషన్లతో సినిమాలు తీయడంతో ఈ జానర్ చాలా త్వరగా మొహం మొత్తేసింది.
మేరీకోమ్, సైనా, 83 లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇందులో 83 చాలా మంచి సినిమా అయినా సరే ప్రేక్షకాదరణ పొందలేదు. ఈ జానర్ జనాలకు ఇప్పుడు రుచించట్లేదన్నది స్పష్టం. అయినా సరే..బాలీవుడ్లో స్పోర్ట్స్ బయోపిక్స్ ఆగట్లేదు. తాజాగా ఈ జానర్లో మరో సినిమా తుస్సుమనిపించింది. అదే.. శభాష్ మిథూ.
దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తాప్సి ప్రధాన పాత్రలో శ్రీజిత్ ముఖర్జీ రూపొందించిన సినిమా.. శభాష్ మిథూ. వయాకామ్ స్టూడియోస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. తాప్సి, మిథాలీ కలిసి ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేశారు. దీని ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. కానీ ఏం లాభం? తొలి రోజు కేవలం రూ.40 లక్షల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టిందీ చిత్రం.
తాప్సికి ఉన్న ఇమేజ్కు ఈ వసూళ్లు మరీ దారుణం. ఇంతకుముందు సైనా సినిమాకు రూ.50 లక్షల వసూళ్లే రాగా.. అప్పుడే ట్రేడ్ పండిట్లు ఆశ్చర్యపోయారు. దాంతో పోలిస్తే శభాష్ మిథూ ట్రైలర్ బాగున్నా, తాప్సి లాంటి స్టార్ నటించినా.. ఈ సినిమాకు ఇంకా తక్కువ కలెక్షన్లు రావడం పెద్ద షాకే. దీన్ని బట్టి స్పోర్ట్స్ బయోపిక్స్ అంటే జనాలకు మొహం మొత్తేసిందని, పైగా మనకు అన్నీ తెలిసిన ప్రెజెంట్ ప్లేయర్స్ జీవితాల మీద సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదని స్పష్టమైంది. కాబట్టి ఇకపై ఈ జానర్లో సినిమాలకు బ్రేక్ ఇస్తే బెటరేమో.
This post was last modified on July 17, 2022 9:29 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…