స్పోర్ట్స్ బయోపిక్.. ఒకప్పుడు బాలీవుడ్కు కాసులు పండించిన జానర్ ఇది. చక్ దే ఇండియా, పాన్ సింగ్ తోమర్, బాగ్ మిల్కా బాగ్ లాంటి సినిమాలు సూపర్ హిట్లవడం.. ఆపై ఎం.ఎస్.ధోనిః ది అన్ టోల్డ్ స్టోరీ, దంగల్, బ్లాక్బస్టర్లు కావడంతో ఇక అందరూ ఆ జానర్ మీద పడిపోయారు.
కానీ అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు.. కాస్త పేరున్న ప్రతి స్పోర్ట్స్ పర్సన్ మీదా సినిమాలు తీయడం మొదలుపెట్టడం.. జనాల ఎమోషన్ పట్టించుకోకుండా ఎగ్జాజరేషన్లతో సినిమాలు తీయడంతో ఈ జానర్ చాలా త్వరగా మొహం మొత్తేసింది.
మేరీకోమ్, సైనా, 83 లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇందులో 83 చాలా మంచి సినిమా అయినా సరే ప్రేక్షకాదరణ పొందలేదు. ఈ జానర్ జనాలకు ఇప్పుడు రుచించట్లేదన్నది స్పష్టం. అయినా సరే..బాలీవుడ్లో స్పోర్ట్స్ బయోపిక్స్ ఆగట్లేదు. తాజాగా ఈ జానర్లో మరో సినిమా తుస్సుమనిపించింది. అదే.. శభాష్ మిథూ.
దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తాప్సి ప్రధాన పాత్రలో శ్రీజిత్ ముఖర్జీ రూపొందించిన సినిమా.. శభాష్ మిథూ. వయాకామ్ స్టూడియోస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. తాప్సి, మిథాలీ కలిసి ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేశారు. దీని ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. కానీ ఏం లాభం? తొలి రోజు కేవలం రూ.40 లక్షల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టిందీ చిత్రం.
తాప్సికి ఉన్న ఇమేజ్కు ఈ వసూళ్లు మరీ దారుణం. ఇంతకుముందు సైనా సినిమాకు రూ.50 లక్షల వసూళ్లే రాగా.. అప్పుడే ట్రేడ్ పండిట్లు ఆశ్చర్యపోయారు. దాంతో పోలిస్తే శభాష్ మిథూ ట్రైలర్ బాగున్నా, తాప్సి లాంటి స్టార్ నటించినా.. ఈ సినిమాకు ఇంకా తక్కువ కలెక్షన్లు రావడం పెద్ద షాకే. దీన్ని బట్టి స్పోర్ట్స్ బయోపిక్స్ అంటే జనాలకు మొహం మొత్తేసిందని, పైగా మనకు అన్నీ తెలిసిన ప్రెజెంట్ ప్లేయర్స్ జీవితాల మీద సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదని స్పష్టమైంది. కాబట్టి ఇకపై ఈ జానర్లో సినిమాలకు బ్రేక్ ఇస్తే బెటరేమో.
This post was last modified on July 17, 2022 9:29 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…