ఈ వారం విడుదలైన సినిమాల్లో పాజిటివ్ టాక్ వచ్చింది ఒక్క సాయిపల్లవి గార్గికే. ముందు అంచనాలేమీ లేవు కానీ రిలీజయ్యాక క్రిటిక్స్ సైతం బాగుందని మెచ్చుకున్నారు. విరాటపర్వం కన్నా చాలా మెరుగ్గా ఉందని ప్రశంసలు అందుతున్నాయి. తమిళ డబ్బింగ్ అయినప్పటికీ అందులో ఎమోషన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతోంది. ఒక షాకింగ్ ఇష్యూని దర్శకుడు డీల్ చేసిన విధానం సీరియస్ మూవీస్ ని ఇష్టపడేవాళ్ళకు కనెక్ట్ అవుతోంది. సరే ఇదంతా బాగానే ఉంది కానీ కౌంటర్ల దగ్గర టికెట్లు అంతగా తెగడం లేదు థియేటర్ల దగ్గర జనం లేరు.
అవును గార్గి రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నా వసూళ్లు మాత్రం నీరసంగా ఉన్నాయి. హౌస్ ఫుల్స్ సంగతి దేవుడెరుగు కనీసం సగం హాళ్లు కూడా నిండటం లేదు. నగరాల్లో అంతో ఇంతో నయం కానీ బిసి సెంటర్స్ లో మాత్రం మరీ సింగిల్ డిజిట్ ఆడియన్స్ వస్తున్నారు. దీని వల్ల షోలు రద్దు చేయలేక, వచ్చినవాళ్ళను వెనక్కు పంపడం ఇష్టం లేక ఓనర్లు పడుతున్న బాధ వర్ణనాతీతం. వీటికి తోడు వర్షాల దెబ్బ మాములుగా లేదు. జనం టైం పాస్ కోసమో సరదా కోసమో బయటికి వచ్చి తుడుచుకుంటూ సినిమాలు చూసే ఆలోచనలో లేరు.
ఇవన్నీ ఒక ఎత్తయితే టికెట్ రేట్లు మరో ఎత్తు. కనీసం గార్గి లాంటి వాటికి బాగా తగ్గించి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ అలా జరగలేదు. ఆ మధ్య హ్యాపీ బర్త్ డేకు మాత్రమే ఫుల్ గా డిస్కౌంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ మొదటికే తెచ్చారు. గార్గి లాంటి సినిమాలకు టికెట్ రేట్ల విషయంలో ప్రత్యేక వెసులుబాటు ఇస్తే ఆక్యుపెన్సీ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అలా చేయడం కాదు కదా కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. ఇకపైనైనా ఈ కోణంలో ఆలోచిస్తే కలెక్షన్లు పెరుగుతాయి.
This post was last modified on July 16, 2022 9:38 pm
తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుందని ఒకవైపు మురిసిపోతూనే, ఇంకోవైపు చాలా విషయాల్లో ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు…
చాన్నాళ్ల నుంచి భారతీయ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ప్రోమో రానే వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎపిక్స్లో ఒకటైన రామాయణం ఆధారంగా…
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…