ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయనే సామెతకు శ్రీలంకలో తాజా పరిస్ధితులే నిదర్శనం. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వారం రోజుల వరకు అత్యంత విలాసంగా గడిపిన అధ్యక్షుడు గొటబాయ కుటుంటం ఇపుడు దేశాన్ని వదిలిపారిపోయేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను ఉన్నతాధికారులు, ప్రజలు కలిసి అడ్డుకోవటంతో మళ్ళీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది.
శ్రీలంకలో ప్రస్తుత అరాచకానికి గొటబాయ కుటుంబమే ప్రధాన కారణం. ఎలాగంటే గొటబాయ రాజపక్స అధ్యక్షుడిగా, ఆయన సోదరుడు మహీంద రాజపక్స ప్రధానమంత్రిగా, మరో ఇద్దరు సోదరులు మంత్రులుగా సంవత్సరాలపాటు చక్రంతిప్పారు. వీళ్ళు అనుసరించిన విధానాల కారణంగానే దేశం సంక్షోభంలోకి కూరుకుపోయింది. దేశాన్ని అన్ని విధాలుగా భ్రష్టుపట్టించటంతో ఆకలిమంటలను తట్టుకోలేక లక్షలాదిమంది జనాలు తిరుగుబాటు లేవదీశారు.
దాంతో ముందు ప్రధాని, ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేశారు. అయితే అధ్యక్షుడు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే రాజపక్స కుటుంబ సభ్యులు 15 మంది దుబాయ్ కు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఎయిర్ పోర్టులో అప్పటికే ఉన్న చాలామందిని కాదని ముందు తమ పాస్ పోర్టులు, వీసాలను ప్రాసెస్ చేయాలని కుటుంబసభ్యులు అధికారులను కోరారు. అందుకు నిరాకరించటంతో వీఐపీ లాంజ్ లో పెద్ద గొడవైంది. దాంతో వాళ్ళంతా రాజపక్స కుటుంబసభ్యులన్న విషయం బయటపడింది.
దాంతో అక్కడున్న జనాలంతా కుటుంబసభ్యులను చుట్టుముట్టి గొడవ మొదలుపెట్టారు. ఈ గొడవలోనే దుబాయ్ కు వెళ్ళాల్సిన విమానం కాస్త వెళ్ళిపోయింది. దాంతో చేసేదిలేక కుటుంబసభ్యులంతా తమ మద్దతుదారులతో విమానాశ్రయం నుండి పారిపోయారు. ఇదే సమయంలో బుధవారం రాజీనామా చేస్తానన్న రాజపక్స రాజీనామాపై తాజాగా ఒక షరతు విధించారు. తమను దేశంవిడిచి వెళ్ళనిస్తేనే అధ్యక్షుడిగా రాజీనామా చేస్తానని మెలికపెట్టారు. దీన్ని జనాలు అంగీకరించటం లేదు. చివరకు ఏమవుతుందనేది వేరే విషయం. ఓడలు బండ్లవుతాయనే సామెతకు రాజపక్స కేంద్రంగా జరుగుతున్న పరిణామాలే తాజా ఉదాహరణ.
This post was last modified on July 13, 2022 9:55 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…