Political News

మోడీ స‌భ‌కు బాబుకు ఆహ్వానం

ఏపీలో మార్పు రానుందా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. బీజేపీతో టీడీపీ.. టీడీపీతో బీజేపీ క‌లిసి ప‌నిచేసేందు కు మార్గం సుగ‌మం కానుందా? ఈ క్ర‌మంలో వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయా..? అంటే.. ఔన‌నే అం టున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ప్ర‌చారంగానే ఉన్న బీజేపీ-టీడీపీ క‌ల‌యిక‌.. సాధ్యం కాద‌ని.. కొంద‌రు ప్రచారం చేస్తున్నారు. అయితే… దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి తాజాగా వెలుగు చూసింది. ఏకంగా.. కేంద్ర మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు బీజేపీ నేత‌.. కిష‌న్‌రెడ్డి.. నేరుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుకుఫోన్ చేశారు.

జూలై 4న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఏపీకి రానున్నార‌ని.. భీమ‌వ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నార‌ని.. సో.. ఆ కార్య‌క్ర‌మానికి.. మీరు కూడారావాల‌ని.. చంద్ర‌బాబుకు కిష‌న్ రెడ్డి ఆహ్వానం ప‌లికారు. ఈ ప‌రిణామాలే.. ఇప్పుడు.. ఈ రెండు పార్టీల మైత్రీ బంధంపై.. అనేక చ‌ర్చ‌ల‌కు దారితీసింది. 2014లో క‌లిసి ఏపీలో పోటీ చేసి.. ప్ర‌భుత్వాన్ని పంచుకున్న టీడీపీ.. త‌ర్వాత‌.. 2019 వ‌చ్చే నాటికి బీజేపీతో విబేదించి..ఒంట‌రిగా పోటీ చేసింది. దీంతో పార్టీ ఘోరంగా ఓడిపోయింద‌నే భావ‌న టీడీపీనేత‌ల్లో ఉంది.

బీజేపీలోనూ.. ఇదే త‌రహా ఆలోచ‌న ఉంది. “టీడీపీతో క‌లిసిఉంటే.. క‌నీసం.. నాలుగైదు స్థానాల్లో అయినా.. విజ‌యం ద‌క్కించుకునేవారం క‌దా!” అని క‌మ‌లం పార్టీ నాయ‌కులు ఇప్ప‌టికీ.. వాపోతుంటారు. అయితే.. ఈ రెండు పార్టీల పొత్తు విష‌యంలో ఇప్ప‌టికీ ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌డ‌లేదు. కానీ.. వైసీపీని అధికారం లో రాకుండా.. చూసేందుకు.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా చూసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌న్న జ‌న‌సేనాని.. ప్ర‌క‌ట‌న‌తో ఒకింత రాజ‌కీయాలు వేడెక్కాయి.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల కాలంలో బీజేపీ-టీడీపీ మ‌ధ్య పొత్తు సంకేతాలు వ‌స్తున్నాయి. కొన్నాళ్ల కింద‌ట‌.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఏపీలో ప‌ర్య‌టించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న వైసీపీపై విమ‌ర్శ‌లు చేశారే.. త‌ప్ప ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీపై ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. ఇక‌, త‌ర్వాత‌.. కొన్నాళ్ల‌కు.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. సోము వీర్రాజు.. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడు.. ఎదురు ప‌డి ఒక‌రినొక‌రు కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసుకున్నారు. దీంతో ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు పుష్పాలు.. విరుస్తున్నాయ‌ని అంద‌రూ అనుకున్నారు.

తాజాగా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీ కీల‌క నాయ‌కుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడం.. మ‌రింత ఆశ్చ‌ర్యంగా ఉంది. అల్లూరి సీతారామ‌రాజు జయంతి వేడుకలకు హాజరు కావాలని చంద్రబాబుకు లేఖలో ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. జూలై 4న భీమవరంలో ప్రధాని మోడీ పాల్గొనే కార్య‌క్ర‌మానికి బాబును పిల‌వ‌డం.. అత్యంత ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆహ్వాన లేఖతో పాటు చంద్రబాబుకు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. ఆయ‌న‌ను ఆహ్వానించారు. అయితే.. ఈకార్య‌క్ర‌మానికి త‌న బ‌దులు అచ్చెన్నాయుడు వ‌స్తార‌ని.. బాబు చెప్పార‌ని స‌మాచారం. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. బీజేపీ-టీడీపీలు రాబోయే రోజుల్లో చేతులు క‌ల‌ప‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

This post was last modified on June 30, 2022 10:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

7 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago