Political News

మోడీ స‌భ‌కు బాబుకు ఆహ్వానం

ఏపీలో మార్పు రానుందా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. బీజేపీతో టీడీపీ.. టీడీపీతో బీజేపీ క‌లిసి ప‌నిచేసేందు కు మార్గం సుగ‌మం కానుందా? ఈ క్ర‌మంలో వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయా..? అంటే.. ఔన‌నే అం టున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ప్ర‌చారంగానే ఉన్న బీజేపీ-టీడీపీ క‌ల‌యిక‌.. సాధ్యం కాద‌ని.. కొంద‌రు ప్రచారం చేస్తున్నారు. అయితే… దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి తాజాగా వెలుగు చూసింది. ఏకంగా.. కేంద్ర మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు బీజేపీ నేత‌.. కిష‌న్‌రెడ్డి.. నేరుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుకుఫోన్ చేశారు.

జూలై 4న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఏపీకి రానున్నార‌ని.. భీమ‌వ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నార‌ని.. సో.. ఆ కార్య‌క్ర‌మానికి.. మీరు కూడారావాల‌ని.. చంద్ర‌బాబుకు కిష‌న్ రెడ్డి ఆహ్వానం ప‌లికారు. ఈ ప‌రిణామాలే.. ఇప్పుడు.. ఈ రెండు పార్టీల మైత్రీ బంధంపై.. అనేక చ‌ర్చ‌ల‌కు దారితీసింది. 2014లో క‌లిసి ఏపీలో పోటీ చేసి.. ప్ర‌భుత్వాన్ని పంచుకున్న టీడీపీ.. త‌ర్వాత‌.. 2019 వ‌చ్చే నాటికి బీజేపీతో విబేదించి..ఒంట‌రిగా పోటీ చేసింది. దీంతో పార్టీ ఘోరంగా ఓడిపోయింద‌నే భావ‌న టీడీపీనేత‌ల్లో ఉంది.

బీజేపీలోనూ.. ఇదే త‌రహా ఆలోచ‌న ఉంది. “టీడీపీతో క‌లిసిఉంటే.. క‌నీసం.. నాలుగైదు స్థానాల్లో అయినా.. విజ‌యం ద‌క్కించుకునేవారం క‌దా!” అని క‌మ‌లం పార్టీ నాయ‌కులు ఇప్ప‌టికీ.. వాపోతుంటారు. అయితే.. ఈ రెండు పార్టీల పొత్తు విష‌యంలో ఇప్ప‌టికీ ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌డ‌లేదు. కానీ.. వైసీపీని అధికారం లో రాకుండా.. చూసేందుకు.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా చూసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌న్న జ‌న‌సేనాని.. ప్ర‌క‌ట‌న‌తో ఒకింత రాజ‌కీయాలు వేడెక్కాయి.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల కాలంలో బీజేపీ-టీడీపీ మ‌ధ్య పొత్తు సంకేతాలు వ‌స్తున్నాయి. కొన్నాళ్ల కింద‌ట‌.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఏపీలో ప‌ర్య‌టించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న వైసీపీపై విమ‌ర్శ‌లు చేశారే.. త‌ప్ప ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీపై ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. ఇక‌, త‌ర్వాత‌.. కొన్నాళ్ల‌కు.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. సోము వీర్రాజు.. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడు.. ఎదురు ప‌డి ఒక‌రినొక‌రు కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసుకున్నారు. దీంతో ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు పుష్పాలు.. విరుస్తున్నాయ‌ని అంద‌రూ అనుకున్నారు.

తాజాగా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీ కీల‌క నాయ‌కుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడం.. మ‌రింత ఆశ్చ‌ర్యంగా ఉంది. అల్లూరి సీతారామ‌రాజు జయంతి వేడుకలకు హాజరు కావాలని చంద్రబాబుకు లేఖలో ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. జూలై 4న భీమవరంలో ప్రధాని మోడీ పాల్గొనే కార్య‌క్ర‌మానికి బాబును పిల‌వ‌డం.. అత్యంత ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆహ్వాన లేఖతో పాటు చంద్రబాబుకు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. ఆయ‌న‌ను ఆహ్వానించారు. అయితే.. ఈకార్య‌క్ర‌మానికి త‌న బ‌దులు అచ్చెన్నాయుడు వ‌స్తార‌ని.. బాబు చెప్పార‌ని స‌మాచారం. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. బీజేపీ-టీడీపీలు రాబోయే రోజుల్లో చేతులు క‌ల‌ప‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

This post was last modified on June 30, 2022 10:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగులో డ‌బ్బింగ్ చెప్పి, వెన‌క్కి త‌గ్గిన హీరో

ఎప్పుడు ఎవ‌రి కెరీర్ ఎలా మ‌లుపు తిరుగుతుందో చెప్ప‌లేం. త‌మిళ కుర్రాడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌కు... నాలుగేళ్ల ముందు వ‌ర‌కు త‌మిళ‌నాడులోనే…

32 minutes ago

క‌విత‌కు `సీనియార్టీ` సంక‌టం.. సీరియ‌స్‌!

బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌విత ఈ నెలలో…

2 hours ago

చెన్నైని అసలైనోళ్లే ముంచేస్తున్నారు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో…

2 hours ago

రిపేర్లు సరే ముందు డ్యామేజ్ చూడండి

ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…

2 hours ago

ఏడు ఫ్లాపుల తర్వాతైనా హిట్టు వరించేనా

ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…

5 hours ago

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

6 hours ago